OTT: ఈ వీకెండ్ ఓటీటీలో అలరించే వెబ్సిరీస్లివే!
ఈ వార్తాకథనం ఏంటి
'రమణి కల్యాణం' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సూర్య వశిష్ఠ, దీప్షికా చంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన 'రమణి కల్యాణం' చిత్రానికి విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే నెలలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఇది ఈటీవీ విన్ వేదికలో డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
వివరాలు
ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'దృఢం'..
ఓటీటీ ప్రేక్షకులను ఉత్కంఠభరిత అనుభూతితో అలరించేందుకు మరో మలయాళ చిత్రం సిద్ధమైంది. షేన్ నిగమ్ కథానాయకుడిగా, మార్టిన్ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన 'దృఢం' ప్రస్తుతం జియో హాట్స్టార్లో ప్రసారమవుతోంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న 'కరుప్పు' సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన 'కరుప్పు' చిత్రాన్ని తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో విడుదల చేశారు. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
వివరాలు
వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన 'రాఖ్' వెబ్సిరీస్..
'పాతాళ్లోక్' ద్వారా గుర్తింపు పొందిన దర్శకుడు ప్రొసిత్ రాయ్ రూపొందించిన తాజా వెబ్సిరీస్ 'రాఖ్'. ఇందులో అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇద్దరు టీనేజర్లు అదృశ్యమైన ఘటన వెనుక ఉన్న నిజాలను ఓ పోలీసు అధికారి ఎలా వెలికితీశాడనే అంశం చుట్టూ ఈ సిరీస్ కథ సాగుతుంది. పలు నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ వెబ్సిరీస్ను రూపొందించారు.