Manchu Manoj: తిరుపతి పోలీసుల అదుపులో మంచు మనోజ్ అరెస్ట్.. అసేలేం జరిగింది..?
ఈ వార్తాకథనం ఏంటి
మంచు కుటుంబంలో వివాదం కొనసాగుతూనే ఉంది. హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది.
తిరుపతిలోని తన ఇంట్లో ఉన్న మనోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని భాకరాపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ అరెస్టు కుటుంబ వివాదంలో మోహన్ బాబు చేసిన ఫిర్యాదుకు అనుగుణంగా జరిగిందని తెలుస్తోంది.
భాకరాపేట సమీపంలోని ఉర్జా రిసార్ట్లో మనోజ్ బస చేస్తున్నారని సమాచారం.
సోమవారం రాత్రి 12 గంటల తర్వాత పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసులు మనోజ్ వద్దకు వెళ్లి అతనిని పలు ప్రశ్నలు అడిగారు.
వివరాలు
నేను టెర్రరిస్ట్ లేదా దొంగనా?
మనోజ్ ఎందుకు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటున్నారని ప్రశ్నించారు. సెలబ్రిటీలకు ఇక్కడ సురక్షితం కాదని వారు సూచించారు.
అయితే మనోజ్, పోలీసులపై మండిపడుతూ,"నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే మీకు ఇబ్బంది ఎందుకు?"అని నిలదీశారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరగటం జరిగిందని తెలుస్తోంది.
"నేను టెర్రరిస్ట్ లేదా దొంగనా?అర్ధరాత్రి ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు?"అని మనోజ్ పోలీసులను అడిగారు.
"సీఎం పేరు ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నారు? మీరు నా దగ్గరకు ఎందుకు వచ్చారు?మమ్మల్ని ఎందుకు బెదిరించారో చెప్పండి,అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా" అంటూ మనోజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మెట్లపై కూర్చొని బీష్మించుకుంటూ చెప్పారు.
ఈ అంశం తెలుసుకున్న సీఐ ఇమ్రాన్ భాషా వచ్చి, వారిని సర్దిచెప్పడంతో మనోజ్ ఆందోళనను విరమించారు.
వివరాలు
మోహన్ బాబు సమాచారంతోనే పోలీసులు అదుపులో మనోజ్
కొద్దిరోజులుగా మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.
యూనివర్సిటీ వద్ద మనోజ్ తన బౌన్సర్లతో గొడవ చేస్తాడని అనుమానంతో మోహన్ బాబు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పోలీసులు అదుపులో మనోజ్
🚨BREAKING NEWS 🚨#ManchuManoj in Police Custody!
— BS 🦅 (@biggscreen_offl) February 18, 2025
Case filled by #MohanBabu Concerning Family Matters
Stay Strong @HeroManoj1 brother
We all are with you❤️pic.twitter.com/nI8AEibJDm