
AS Ravikumar: టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ కన్నుమూత.. సంతాపం ప్రకటించిన దర్శకుల సంఘం
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్కు చెందిన ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు.
గుండెపోటుతో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి సినీ పరిశ్రమను విషాదంలో ముంచింది.
రవికుమార్ దర్శకత్వ ప్రయాణం:
గోపీచంద్ హీరోగా నటించిన 'యజ్ఞం' చిత్రంతో ప్రారంభమైంది. ఆ తరువాత బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'వీరభద్ర' సినిమాకు దర్శకత్వం వహించారు.
అలాగే, సాయి ధరమ్ తేజ్తో కలిసి చేసిన 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రం ద్వారా ప్రేక్షకులకి మరింత చేరువయ్యారు.
ఆయన చివరిసారిగా తెరకెక్కించిన చిత్రం 'తిరగబడరా సామి'.
దర్శకుడు రవికుమార్ అకాలమరణంపై తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి మృతి.
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి మృతి.
— Volganews (@Volganews163907) June 11, 2025
టాలీవుడ్ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు.
గుండెపోటుతో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గోపీచంద్ హీరోగా ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమ్యారు రవి కుమార్.
ఆ తర్వాత బాలకృష్ణతో ‘వీరభద్ర’, సాయి ధరమ్… pic.twitter.com/swN5J9Z9tx