
Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్తో యువ నటుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విభు రాఘవ్ క్యాన్సర్తో పోరాడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
క్యాన్సర్ నాలుగో దశ (స్టేజ్-4)తో కొంతకాలంగా చికిత్స పొందుతున్న విభు... తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చివరికి మృతిచెందాడు.
విభు రాఘవ్ 'నిషా అండ్ ఉస్కే కజిన్స్', 'సువారిన్ గుగ్గల్', 'రిథమ్' వంటి టీవీ షోల్లో తనదైన నటనతో పేరొందారు. వైవిధ్యమైన పాత్రల్లో జీవించి ప్రేక్షకుల మనసు గెలిచారు.
2022లో క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూ జీవితం కోసం పోరాడుతూ వచ్చారు. విభు మృతితో టెలివిజన్ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.
Details
టీవీ పరిశ్రమ తీవ్ర విషాదం
'యే రిష్టే హై ప్యార్ కే' నటి కావేరి ప్రియమ్ ఆయన మృతిపట్ల ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే 'బిగ్ బాస్ 18' విజేత కరణ్వీర్ మెహ్రా సహా అనేక మంది సహ నటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో విభు రాఘవ్కు పెద్ద శస్త్రచికిత్స జరిగింది.
శరీరంలోని కణితిని తొలగించారు. తాను బతికేందుకు కలిగిన ధైర్యానికి, కుటుంబం, స్నేహితుల మద్దతు వల్లే స్ఫూర్తిగా నిలిచిందని అప్పట్లో పేర్కొన్నాడు.
ఇప్పుడు విభు రాఘవ్ కన్నుమూయడంతో టీవీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.