English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్తున్నారా? కనతల్ ప్రాంతంలో ఉండే ఈ ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి
    తదుపరి వార్తా కథనం
    ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్తున్నారా? కనతల్ ప్రాంతంలో ఉండే ఈ ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి
    కనకల్ ప్రాంతంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు

    ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్తున్నారా? కనతల్ ప్రాంతంలో ఉండే ఈ ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 23, 2023
    06:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్ రాష్టంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో అందమైన పర్యాటక ప్రాంతంగా చెప్పుకోదగ్గ వాటిల్లో కనతల్ ఒకటి. కనువిందు చేసే హిమాలయాలు, ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని అబ్బురపరుస్తాయి.

    అడ్వెంచర్ యాక్టివిటీస్ కి ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి.కనతల్ ప్రాంతంలో అక్టోబర్ నుండి మార్చ్ వరకు అనేక పండగలు జరుగుతాయి.

    ఈ టైంలో పర్యాటకానికి వెళ్లడం చాలా బాగుంటుంది. అయితే కణతాల్ ప్రాంతంలో ఏయే ప్రదేశాలు సందర్శించాలో ఇక్కడ తెలుసుకుందాం.

    కొడియా ఫారెస్ట్

    మీరు ప్రకృతి ప్రేమికులైతే ఈ అడవి అందాలని ఎంతగానో ఆనందిస్తారు. అడవిలో రకరకాల జింకలు, ఎలుగుబంట్లు, ఎన్నో రకాల పక్షులు కనిపిస్తుంటాయి. వైల్డ్ ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఈ ప్రదేశం బాగా నచ్చుతుంది.

    Details

    ఎత్తయిన డ్యామ్ ఉన్న ప్రదేశం 

    సుకంద దేవి టెంపుల్

    కనతల్ ప్రాంతంలో ఉండే ప్రసిద్ధ దుర్గా దేవాలయం ఇది. ఈ దేవాలయానికి సంవత్సరం పొడుగునా భక్తులకు వస్తూనే ఉంటారు. ఈ గుడి దగ్గర నుండి హిమాలయ పర్వతాలు కనిపిస్తాయి.

    పురాణాల ప్రకారం కైలాసానికి పార్వతితో పాటు శివుడు వెళుతుండగా, సడన్గా పార్వతి తల ఈ ప్రదేశంలో పడిపోయిందని, ఆ తర్వాత ఆ ప్రాంతంలోనే గుడి కట్టారని చెప్పుకుంటారు.

    న్యూ తెహ్రి

    ఈ ప్రాంతంలో ఆసియాలోనే అతి పెద్దదైన, ఎత్తయిన డ్యామ్ లలో ఒకటైన తెహ్రీ డ్యాం ఉంటుంది. సముద్ర మట్టానికి 260 మీటర్ల ఎత్తులో ఈ డ్యాం ఉంది. ఇక్కడ తెహ్రీ లేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    Details

    ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అభివృద్ధి చేసిన పార్క్ 

    చంద్రబద్నీ టెంపుల్

    కనతల్ ప్రాంతంలో అత్యంత పవిత్రమైన గుడి ఇది. సముద్ర మట్టానికి 2,777 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతం మీద ఈ గుడి ఉంటుంది. పార్వతీ దేవికి చెందిన ఈ గుడికి ప్రపంచ దేశాల నుండి భక్తులు వస్తుంటారు.

    ప్రతీ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ ప్రాంతంలో జాతర జరుగుతుంది.

    ధనాల్టీ ఎకో పార్క్

    పర్యాటకాన్ని అభివృద్ధి చేసి సందర్శకులను ఆకర్షించడానికి ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పార్కును అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతంలో దేవదారు వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం

    తాజా

    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు బెంగళూరు

    పర్యాటకం

    ట్రావెల్: ఈజిప్టు వెళ్తున్నారా? అక్కడ ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    ట్రావెల్: సందర్శన కోసం వేరే ప్రాంతం వెళ్ళిన ప్రతీసారీ ఆరోగ్యం దెబ్బతింటుందా? ఇలా చేయండి లైఫ్-స్టైల్
    ట్రావెల్: పోర్చుగల్ పర్యటనలో చేయకూడని తప్పులు లైఫ్-స్టైల్
    ట్రావెల్: పూర్తి వైన్ తాగకుండానే మళ్లీ వైన్ పోస్తే తప్పుగా చూసే గ్రీస్ దేశం పద్ధతులు తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025