Varun Lavanya: అత్తగారింట్లో లావణ్య త్రిపాఠి తొలి దీపావళి వేడుకలు.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ పెళ్లి తర్వాత కలిసి మొదటి దీపావళిని జరుపుకున్నారు. లావణ్య తన అత్తమామలు పద్మజ, నాగబాబు, నిహారికతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దీపావళి వేడుకల ఫొటోలను తమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వారి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో వివాహ బంధంతో వరుణ్- లావణ్య ఒక్కటయ్యారు. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోని నటులు, స్నేహితులు, సన్నిహుతల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల సమయంలో వరుణ్, లావణ్య ప్రేమలో పడ్డారు.