
Chiyaan Vikram: 'SSMB29' నుంచి విక్రమ్ వెనక్కి..? రాజమౌళి ఆఫర్కు నో చెప్పిన చియాన్!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్లే మరో భారీ ప్రాజెక్ట్పై సూపర్ స్టార్ మహేష్ బాబు, విజినరి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కలిసి పని చేస్తున్నారు.
SSMB29పై దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఈ సినిమాలో ఒక్కో భాష నుంచి ఒక్కో స్టార్ నటించాలని రాజమౌళి అండ్ టీం పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే చియాన్ విక్రమ్ను విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.
విక్రమ్ ఎంట్రీ టాక్ వచ్చింది కాబట్టి మహేష్ - రాజమౌళి కాంబోపై చర్చలు ఊపందుకున్నాయి. అయితే ఈ గందరగోళానికి బ్రేక్ పడింది.
Details
విక్రమ్.. రాజమౌళికి నో చెప్పారు!
సినిమాల్లో విలన్ పాత్రలు చేయడానికి ఇప్పుడైతే ఆసక్తి లేకపోవడంతో చియాన్ విక్రమ్, రాజమౌళి ఆఫర్ను మర్యాదపూర్వకంగా తిరస్కరించినట్టు సమాచారం.
మల్టీస్టారర్లకు ఎప్పుడూ ఓపెన్గానే ఉండే విక్రమ్ - ప్రస్తుతానికి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల నుంచి గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
విక్రమ్ లైన్ నుంచి తప్పుకోవడంతో.. రాజమౌళి మళ్లీ ప్లాన్ మార్చారట. ఈసారి కన్ను మాధవన్ మీద పడిందట.
తమిళ నటుడు ఆర్ మాధవన్ను ఫిల్మ్ టీం తాజాగా సంప్రదించినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఆయనకు అధికారికంగా కథ వినిపించారా? ఓకే చెప్పారా? అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే మాధవన్ పేరు వినిపించడంతో మళ్లీ కథానాయికలు మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
Details
హీరోయిన్ గా ప్రియాంక చోప్రా
ఇదిలా ఉంటే.. ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో ఇతర నటులు మాత్రం ఫిక్స్ అయ్యారు.
ఫేమస్ బాలీవుడ్ నటిగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వీరి పాత్రల వివరాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉంచారు.
Details
ఒరిస్సా నుంచి హైదరాబాదు వరకూ.. షూటింగ్ నాన్ స్టాప్
హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్ వేశారని, ఆ సెట్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసినట్లు సమాచారం.
అనంతరం మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంకా, పృథ్వీరాజ్లతో కూడిన టీం ఒరిస్సా వెళ్లి అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఆ తరువాత మళ్లీ హైదరాబాద్ చేరిన యూనిట్, సమ్మర్ హాలిడేస్ కారణంగా తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంది. తాజా షెడ్యూల్ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది.
బజెట్ పరంగా సంచలన రేంజ్లో సినిమా
సుమారు రూ.1000కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను *దుర్గా ఆర్ట్స్* బ్యానర్పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
టెక్నికల్, విజువల్ గ్రాండియర్ పరంగా ఈ చిత్రం భారత సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.