
విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే
ఈ వార్తాకథనం ఏంటి
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష, ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
మూడవ కన్నుతో మాత్రమే చూడగలిగే నిజం రాబోతుందని, చూడటానికి సిద్ధంగా ఉండాలని, మే 21నుండి స్ట్రీమింగ్ అవుతుందని తన అధికారిక సోషల్ అకౌంట్ లో పోస్ట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్.
ఏప్రిల్ 21వ తేదీన రిలీజైన విరూపాక్ష, సరిగ్గా నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు 90కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. హిందీ, తమిళం, మళయాలం భాషల్లో కూడా రిలీజైంది ఈ సినిమా.
ఈ సినిమాను కార్తీక్ దండు డైరెక్ట్ చేయగా, దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష
Moodo kannutho maathrame choodakalige oka nijam raabothundhi. Meeru choodadaaniki siddham kandi.
— Netflix India South (@Netflix_INSouth) May 16, 2023
Virupaksha, coming to Netflix on 21st May. #VirupakshaOnNetfix pic.twitter.com/2mxVdoCU3l