సింహాద్రి రీ రిలీజ్ పై వైరల్ అవుతున్న విశ్వక్ సేన్ కామెంట్లు
టాలీవుడ్ లో రీ రీలీజ్ ల పండగ నడుస్తోంది. అప్పట్లో మంచి సక్సెస్ అయిన చిత్రాలను మళ్ళీ రిలీజ్ చేసి అభిమానులకు కొత్త ఉత్సహాన్ని పంచుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా దేశ ముదురు సినిమా థియేటర్లలోకి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సింహాద్రి సినిమాను మళ్ళీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మే 20వ తేదీన సింహాద్రి సినిమా తెలుగు ప్రేక్షకులను థియేటర్లలోకి పిలుస్తోంది. అయితే సింహాద్రి సినిమా రీ రిలీజ్ గురించి స్పందించిన హీరో విశ్వక్ సేన్, థియేటర్ల దగ్గర మాస్ జాతర మొదలు కాబోతుందని, మాస్ అమ్మ మొగుడు ఎన్టీఆర్ వస్తున్నాడని కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ అవుతోంది.