IIT Bombay: రామాయణం నాటకం వేసినందుకు ఐఐటీ బాంబే విద్యార్థులకు భారీ జరిమానా.. ఎందుకంటే..?
రామాయణంపై అభ్యంతరకరంగా నాటకం వేసినందుకు ఐఐటీ బాంబే విద్యార్థులకు భారీ జరిమానా విధించింది. ఈ నాటకం మార్చి 31న ఐఐటీ బాంబే వార్షిక కళా ఉత్సవంలో ప్రదర్శించారు. ఐఐటీ బాంబే విద్యార్థులు'రాహోవన్'అనే నాటకంలో పాల్గొన్నారు.ఈ డ్రామాపై కొన్ని ఫిర్యాదులు అందాయి. ఈ నాటకంలో విద్యార్థులు రాముడు,సీత పాత్రలను అభ్యంతరకరంగా చిత్రీకరించారని ఆరోపించారు. అయితే, నాటకం ప్రగతిశీలంగా ఉందని, ఇది అందరి ప్రశంసలు పొందిందని విద్యార్థులు నాటకానికి మద్దతు ఇస్తున్నారు. ఈ నాటకం వల్ల మన సంస్కృతి,మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల అనంతరం క్రమశిక్షణా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఫిర్యాదులు అందిన విద్యార్థులను కూడా పిలిపించారు. ఈ సమయంలో,చాలా చర్చల తరువాత,కమిటీ కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఏడుగురు విద్యార్థులకు శిక్ష
దీని కింద సీనియర్ విద్యార్థులకు రూ.1.2 లక్షల జరిమానా విధించారు. జూనియర్ విద్యార్థులకు రూ.40 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా వారికి హాస్టల్ సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి. ఈ కేసులో ఏడుగురు విద్యార్థులకు శిక్ష పడినట్లు సమాచారం. విద్యార్థుల ఈ చర్యపై వ్యాఖ్యానించేందుకు ఐఐటీ బాంబే నిరాకరించింది.