NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kakinada: 1,320 టన్నుల రేషన్ బియ్యం సీజ్‌.. కలెక్టర్ కీలక ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Kakinada: 1,320 టన్నుల రేషన్ బియ్యం సీజ్‌.. కలెక్టర్ కీలక ప్రకటన
    1,320 టన్నుల రేషన్ బియ్యం సీజ్‌.. కలెక్టర్ కీలక ప్రకటన

    Kakinada: 1,320 టన్నుల రేషన్ బియ్యం సీజ్‌.. కలెక్టర్ కీలక ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 17, 2024
    03:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలనతో కదలిక వచ్చిన కాకినాడ పోర్టు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

    నవంబర్ 29న పవన్ కళ్యాణ్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకను పరిశీలించిన తర్వాత అధికారులు దర్యాప్తు చేపట్టారు.

    మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు.

    డిప్యూటీ సీఎం పరిశీలన అనంతరం ఐదు విభాగాల అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్టెల్లా షిప్‌లో 12 గంటల పాటు సోదాలు నిర్వహించారు.

    నౌకలో ఉన్న 5 కంపార్ట్‌మెంట్ల నుంచి 12 శాంపిల్స్‌ సేకరించామన్నారు.

    Details

    నిబంధనలు మరింత కఠినతరం

    మొత్తం 4,000 టన్నుల బియ్యం ఉండగా, అందులో 1,320 టన్నుల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని కలెక్టర్ తెలిపారు.

    సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్‌ ద్వారా ఈ బియ్యం ఎగుమతి జరుగుతున్నట్లు గుర్తించారు.

    వారు బియ్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడ నిల్వచేశారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

    1,320 టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేసి సీజ్ చేస్తామని, ఇకపై నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

    Details

    అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు

    కాకినాడ పోర్టులో ఇంకా 12 వేల టన్నుల బియ్యం లోడ్ చేయాల్సి ఉందని, వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోడింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు.

    కాకినాడ యాంకేజ్‌ పోర్టు, డీప్‌ వాటర్‌ పోర్టులో అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు.

    ఒక్క గ్రాము పీడీఎస్‌ బియ్యం కూడా దేశం దాటకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, బియ్యం వ్యాపారం నిజాయతీగా చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ స్పష్టంచేశారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    కాకినాడ సిటీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పవన్ కళ్యాణ్

    Narendra Modi: ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు  నరేంద్ర మోదీ
    AP News: మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు.. 'జలజీవన్‌ మిషన్‌'పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం ఆంధ్రప్రదేశ్
    Pawan Kalyan: తిరుమల లడ్డూపై వివాదం.. సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటుకు డిమాండ్ తిరుమల తిరుపతి దేవస్థానం
    Hari Hara Veera Mallu Movie: పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్..  'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు

    కాకినాడ సిటీ

    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య బెంగళూరు
    Sitaram Yechury: సీతారాం ఏచూరికి కాకినాడతో అనుబంధం.. గతంలో కాకినాడ లైబ్రరీకి రూ.10 లక్షల సాయం  భారతదేశం
    Ration rice: స్టెల్లా నౌక యాజమాన్యంపై ప్రభుత్వ విచారణ.. అక్రమ రవాణాపై చర్యలు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025