NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్‌తోనే పార్లమెంట్‌లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? 
    తదుపరి వార్తా కథనం
    Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్‌తోనే పార్లమెంట్‌లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? 
    Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్‌తోనే పార్లమెంట్‌లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు?

    Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్‌తోనే పార్లమెంట్‌లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? 

    వ్రాసిన వారు Stalin
    Dec 13, 2023
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్‌లో బుధవారం భద్రతా లోపం కారణంగా ఇద్దరు దుండగులు హల్‌చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

    ఇద్దరు వ్యక్తులు లోక్‌‌సభలోని పబ్లిక్ గ్యాలరీ నుంచి ఛాంబర్‌లోకి దూకి.. కలర్ స్ప్రేలు చల్లి నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారిని పట్టుకున్న భద్రతా సిబ్బంది విచారణ మొదలు పెట్టారు.

    ఈ క్రమంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులను సాగర్, మనోరంజన్‌లుగా గుర్తించారు.

    నిందితుడు సాగర్ శర్మ వద్ద సందర్శకుల పాస్‌ లభించింది. ఆ పాస్ జారీ చేసింది బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కావడంతో చర్చనియాంశంగా మారింది.

    ఎంపీ సింహా పేరుతో జారీ చేసిన విజిటర్ పాస్ ద్వారానే నిందితుడు సాగర్ పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించాడని భద్రతా వర్గాలు తెలిపాయి.

    బీజేపీ

    ప్రతాప్ సింహా ఎవరు?

    ప్రతాప్ సింహా కర్ణాటకలోని మైసూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. అతను వరుసగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు.

    కర్ణాటకలో బీజేపీ యువమోర్చా మాజీ అధ్యక్షుడిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ప్రతాప్ సింహ జర్నలిస్టు కూడా ఉన్నారు.

    1999లో ప్రతాప్ సింహా కన్నడ వార్తాపత్రిక విజయ కర్ణాటకలో ట్రైనీగా తన జర్నలిజం జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ వార్తాపత్రికల్లో పని చేశారు.

    ప్రతాప్ సింహా కర్ణాటకలోని హిల్ స్టేషన్లలో ఒకటైన సకలేష్‌పూర్‌లో జన్మించారు.

    2008లో సింహా 'నరేంద్ర మోదీ: ది అన్‌ట్రాడెన్ రోడ్' అనే మోదీ జీవిత చరిత్రను రాయడం ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించారు.

    బీజేపీ

    ఈరోజు ఏమి జరిగింది

    పార్లమెంట్ హౌస్‌పై ఉగ్రదాడి దాడి నేటికి (డిసెంబర్ 13) 22 ఏళ్లు పూర్తయ్యాయి.

    సరిగ్గా ఇదే రోజున లోక్‌సభ కార్యకలాపాలు జరుగుతుండగా.. జీరో అవర్ సమయంలో మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకారు.

    అనంతరం రంగుల స్ప్రే చేయడం ప్రారంభించారు. ఈ ఘటన సంచలనంగా మారింది.

    భద్రతా సిబ్బంది, కొందరు ఎంపీలు దుండగులను చుట్టిముట్టి పట్టుకున్నారు.

    2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22ఏళ్లు పూర్తైన రోజే.. పార్లమెంట్‌ భద్రత లోపం మరోసారి బయటపడింది.

    ఈ ఘటనపై లోక్‌సభ తన స్థాయిలో విచారణ జరుపుతోందని, ఢిల్లీ పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభలో వ్యాపించిన పొగ సాధారణమైదని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విజిటర్ పాస్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన కాంగ్రెస్ నేత

    सदन के अंदर 2 लोग घुसे और कैन के धुएँ से सदन को भर दिया

    आज संसद पर आतंकी हमले की 22वीं बरसी है — और आज भी संसद की सुरक्षा में इतनी बड़ी चूक कैसे संभव है?

    आख़िर कौन थे ये लोग जिनके अंदर आने के पास भाजपा के मैसूर सांसद प्रताप सिम्हा ने बनवाये? pic.twitter.com/oP4sQpwnS8

    — Supriya Shrinate (@SupriyaShrinate) December 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్
    బీజేపీ
    ఎంపీ
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పార్లమెంట్

    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  నరేంద్ర మోదీ
    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన  పార్లమెంట్ కొత్త భవనం
    పార్లమెంటులో నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ.. భారత్- కెనడా సంబంధాలపై కీలక చర్చ నరేంద్ర మోదీ
    అమెరికా పార్లమెంట్ స్పీకర్‌ తొలగింపు.. 234ఏళ్ల యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి  అమెరికా

    బీజేపీ

    దిల్లీకి పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తుపై చర్చ  తెలంగాణ
    హేమమాలినితో డ్యాన్స్ చేయించామన్న హోంమంత్రి.. రాష్ట్రంలో రేగిన రాజకీయ దుమారం మధ్యప్రదేశ్
    BJP : ఆశ్చర్యపర్చిన బీజేపీ రెండో జాబితా.. ఒకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం తెలంగాణ
    Priyanka Gandhi: గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం కేవలం 21 ఉద్యోగాలే ఇచ్చింది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ

    ఎంపీ

    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు ఆంధ్రప్రదేశ్
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు రాహుల్ గాంధీ
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    Revanth Reddy- KCR: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి  రేవంత్ రెడ్డి
    USA: యూదు వ్యతిరేక నిరసనలు.. పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్ రాజీనామా.. అమెరికా
    BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి  మాయావతి
    power consumption: ఏప్రిల్- నవంబర్ మధ్య భారత్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం  విద్యుత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025