Page Loader
UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, దీనిలో 13 మంది కూలీలతో వాహనం ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం, అర్ధరాత్రి 1 గంట సమయంలో కచ్వా సరిహద్దు జిట్ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది.

వివరాలు 

ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన ట్రక్కు  

13 మంది కూలీలు వారణాసి వైపు వెళ్తుండగా, అదుపు తప్పిన ఒక ట్రక్కు వారి ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడడంతో వారిని బనారస్ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 13 మంది కూలీలు భదోహ జిల్లా నుంచి తమ పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.