NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు

    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి

    వ్రాసిన వారు Stalin
    Jan 13, 2023
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని నాసిక్-షిర్డీ హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీకి యాత్రికులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దాదాపు 34 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

    50మంది యాత్రికులతో ఠాణె నుంచి షిర్డీకి బస్సు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మరణించిన పది మందిలో ముగ్గురు పురుషులు, ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు.

    అయితే గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సీఎం షిండే ట్వీట్

    नाशिक शिर्डी महामार्गावर झालेल्या खासगी बसचा अपघात अत्यंत दुर्दैवी आहे. या दुर्घटनेत मृतांच्या कुटुंबीयांना प्रत्येकी पाच लाखांची मदत जाहीर करण्यात आले असून जखमींवर शासकीय खर्चाने वैद्यकीय उपचार देण्यात येणार आहेत. तसेच या अपघाताच्या चौकशीचे निर्देश प्रशासनाला दिले आहेत.

    — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) January 13, 2023

    రోడ్డు ప్రమాదం

    బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

    నాసిక్-షిర్డీ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను త్వరగా షిర్డీలోని ఆసుపత్రులకు తరలించి, వారికి సరైన చికిత్స అందించాలన్నారు.

    ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని సీఎం షిండే అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

    2022లో జనవరి- సెప్టెంబర్ మధ్య మహారాష్ట్రలో 24,360 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు రాష్ట్ర రవాణా శాఖ నివేదకలు చెబుతున్నాయి. 2022లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం 11,149 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021తో పోలిస్తే 2022లో 1,272 ఎక్కువ మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025