NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mukesh Kumar Meena: ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో 100 కోట్ల నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం 
    తదుపరి వార్తా కథనం
    Mukesh Kumar Meena: ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో 100 కోట్ల నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం 
    ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో 100 కోట్ల నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం

    Mukesh Kumar Meena: ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో 100 కోట్ల నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 11, 2024
    06:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రూ.100 కోట్ల విలువైన నగదు,మద్యం,డ్రగ్స్,బంగారం,వెండి,ఇతర ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గురువారం తెలిపారు.

    కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

    సరిహద్దు రాష్ట్రాల పోలీసు బలగాలు,ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకుంటున్నామని చెప్పారు.

    అయితే సాధారణ పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తనిఖీలు నిర్వహించాలని బృందాలను ఆదేశించినట్లు సీఈవో వివరించారు.

    Details 

    మద్యం ప్రభావానికి అడ్డుకట్ట వేసేందుకు ఎండ్‌ టు ఎండ్‌ నిఘా

    రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో మద్యం ప్రభావానికి అడ్డుకట్ట వేసేందుకు మద్యం తరలింపుపై ఎండ్‌ టు ఎండ్‌ నిఘా ఉంచామని తెలిపారు.

    రాష్ట్రవ్యాప్త పర్యవేక్షణలో భాగంగా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)ని అమలు చేయడం ద్వారా మద్యం తరలింపును ట్రాక్ చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మేనేజింగ్ డైరెక్టర్‌ను CEO ఆదేశించారు.

    "డిస్టిలరీ / బ్రూవరీ నుండి APSBCL గోడౌన్‌కు మద్యం తరలింపును GPS ట్రాక్ చేయాలని, దాని ఫీడ్‌ను జిల్లా ఎన్నికల కార్యాలయ కంట్రోల్ రూమ్,CEO కంట్రోల్ రూమ్‌కు అందించాలి" అని మీనా ఒక ఆర్డర్‌లో తెలిపారు.

    మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    YS Sharmila: ఏపీలో నియంత పాలన నడుస్తోంది: జగన్ ప్రభుత్వంపై షర్మిల ధ్వజం  వైఎస్ షర్మిల
    AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల ఎన్నికల సంఘం
    Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  జనసేన
    chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025