LOADING...
AI Impact Summit: డిజిటల్‌ విప్లవంలో భారత్‌ - ప్రపంచ నేతల ప్రశంసలు
డిజిటల్‌ విప్లవంలో భారత్‌ - ప్రపంచ నేతల ప్రశంసలు

AI Impact Summit: డిజిటల్‌ విప్లవంలో భారత్‌ - ప్రపంచ నేతల ప్రశంసలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. దిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌'లో మొత్తం 118 దేశాలు పాల్గొన్నాయి. గురువారం జరిగిన అధికారిక ప్రారంభ వేడుకలో పలువురు దేశాధినేతలు,సాంకేతిక రంగ ప్రముఖులు హాజరై ముఖ్య ప్రసంగాలు చేశారు. డిజిటల్‌ రంగంలో భారత్‌ సాధిస్తున్న విప్లవాత్మక పురోగతిని వారు కొనియాడుతూ, దేశం ఏఐ రంగంలో ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

భారత్‌లో అభివృద్ధి వేగం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది: సుందర్‌ పిచాయ్

"కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తాయి. ఏఐ నిర్మాణం సమాజంలోని ప్రతి వర్గానికీ ఎంతో మేలు చేస్తుంది. నేను ప్రతి సారి భారత్‌ను సందర్శించినప్పుడు ఇక్కడి అభివృద్ధి వేగం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఐఐటీ ఖరగ్‌పూర్‌కు విశాఖపట్నం మీదుగా ప్రయాణించేవాడిని. ఇప్పుడు అదే విశాఖ తీరంలో గూగుల్‌ ఫుల్‌ స్టాక్‌ ఏఐ హబ్‌ ఏర్పాటు అవుతుండటం గర్వకారణం" అని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు.

వివరాలు 

ఏ దేశానికీ సాధ్యం కానిది భారత్‌ సాధించింది: మాక్రాన్

"డిజిటల్‌ రంగంలో భారత్‌ అసాధారణమైన మార్పులు తీసుకువచ్చింది. గతంలో భారత్‌లో బ్యాంకు ఖాతా ప్రారంభించడం కష్టసాధ్యంగా ఉండేది. అయితే ఇప్పుడు ఎలాంటి పత్రాలు లేకుండానే మొబైల్‌ ఫోన్‌ ద్వారా బ్యాంకు ఖాతా తెరవగల సౌకర్యం అందుబాటులో ఉంది. 140 కోట్ల ప్రజలకు డిజిటల్‌ గుర్తింపు వ్యవస్థను అందించింది. ఆవిష్కరణల దిశగా ప్రపంచ దేశాలు కలిసి ముందుకు సాగాలి. ప్రస్తుతం ప్రతి నెలా 20 బిలియన్‌లకు పైగా డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నాయి. అలాగే 500 మిలియన్‌ల మందికి డిజిటల్‌ ఆరోగ్య గుర్తింపులు జారీ చేయబడ్డాయి" అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ప్రశంసించారు.

Advertisement

వివరాలు 

ఏఐ కల్పితం కాదు - వాస్తవం: చంద్రశేఖరన్

"ఈ ఏఐ సదస్సులో పాల్గొనడం నాకు గౌరవంగా ఉంది. డిజిటల్‌ మౌలిక వసతుల నిర్మాణంలో భారత్‌ విశేష పాత్ర పోషిస్తోంది. 140 కోట్ల మంది ప్రజలతో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ ఐడెంటిటీ వ్యవస్థను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్‌ లావాదేవీలలో సగభాగం భారత్‌లోనే జరుగుతున్నాయి. దేశాన్ని ఏఐ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని కృషి చేస్తున్నారు. సెమీకాన్‌ ఇండియా, ఇండియా ఏఐ మిషన్‌ కార్యక్రమాల ద్వారా సాంకేతిక రంగ అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఏఐ నైపుణ్య శిక్షణలో కూడా భారత్‌ ముందంజలో ఉంది. ఏఐ అనేది కేవలం కృత్రిమం కాదు, అది నిజమైన శక్తి" అని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు.

Advertisement