
Diwali: దీపావళికి 14,086 బస్సులు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవలు!
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగ సందర్బంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్ 14,086 ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ నెల 28 నుంచి 30 వరకు చెన్నై నుంచి రోజుకు 2,092 బస్సులు, అదనంగా 4,900 ప్రత్యేక బస్సులతో కలిపి మొత్తం 11,176 బస్సులు నడుపుతామన్నారు.
ఈ మూడు రోజులలో 2,901 ప్రత్యేక బస్సులు నడుపుతామని మంత్రి స్పష్టం చేశారు.
దీపావళి పండుగ అనంతరం స్వస్థలాల నుంచి చెన్నైకి తిరిగి రానున్న వారి కోసం రోజుకు 2,092 బస్సులు, 3,165 ప్రత్యేక బస్సులతో మొత్తం 9,441 బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
Details
బస్ స్టేషన్ల వివరాలు
కీలంబాక్కం
కలైంజర్ శతజయంతి స్మారక బస్స్టేషన్ నుంచి పుదుచ్చేరి, చిదంబరం, తిరుచ్చి, మదురై వంటి నగరాలకు బస్సులు నడుపుతారు.
కోయంబేడు
ఈ బస్స్టేషన్ నుంచి ఈసీఆర్, కాంచీపురం, బెంగళూరు, హోసూరు వంటి నగరాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి. మాధవరం
మాధవరం
మాధవరం బస్స్టేషన్ నుంచి పొన్నేరి, ఊత్తుకోట, తిరుచ్చి, సేలం, కుంభకోణం వంటి నగరాలకు బస్సులు నడుపుతారు.
Details
కంట్రోల్ రూమ్ వివరాలు
ప్రత్యేక బస్సుల టికెట్లు రిజర్వు చేసేందుకు కీలంబాక్కం బస్స్టేషన్లో 7, కోయంబేడు బస్స్టేషన్లో 2 రిజర్వేషన్ కౌంటర్లు పనిచేస్తాయి. ఇక tnstc అధికారిక యాప్ (www.tnstc.in) ద్వారా కూడా టికెట్లను రిజర్వు చేసుకోవచ్చు.
ప్రయాణికుల సౌకర్యార్థం 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు.
బస్సుల సర్వీసులతో సంబంధించి సమస్యల కోసం 9445014436 నంబరుకు కాల్ చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఉపయోగించవచ్చు.
ఈ సందర్భంగా, మంత్రి శివశంకర్ చెన్నై సచివాలయంలో మహానగర రవాణా సంస్థ మాజీ ఉద్యోగుల వారసులకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.