LOADING...
Maharashtra: ముంబైలో హైడ్రామా: ఆడిషన్‌కి వచ్చిన పిల్లలను బంధించిన యూట్యూబర్..
ముంబైలో హైడ్రామా: ఆడిషన్‌కి వచ్చిన పిల్లలను బంధించిన యూట్యూబర్..

Maharashtra: ముంబైలో హైడ్రామా: ఆడిషన్‌కి వచ్చిన పిల్లలను బంధించిన యూట్యూబర్..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలో హైడ్రామా చోటు చేసుకుంది. RA స్టూడియోలో ఆడిషన్‌ కోసం వచ్చిన చిన్నారులను రోహిత్ ఆర్య అనే వ్యక్తి బందీలుగా మార్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తనకు ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలని రోహిత్ డిమాండ్‌ చేశాడు. ఆప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే పిల్లలతో పాటు తాను సజీవదహనం అవుతానని హెచ్చరిక జారీ చేశాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో రోహిత్ ఆర్య ఆస్టూడియోలోనే ఉద్యోగం చేస్తున్నాడని తేలింది. పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి పోలీసులు తక్షణమే కమాండో ఆపరేషన్‌ ప్రారంభించారు. రోహిత్‌ను సముదాయించి అదుపులోకి తీసుకున్నారు.దీంతో పిల్లలను సురక్షితంగా రక్షించగలిగారు. రోహిత్ మానసిక స్థితి స్థిరంగా లేదని పోలీసులు గుర్తించారు.సంఘటన స్థలంలో బొమ్మ తుపాకీతో పాటు కొన్ని రసాయన పౌడర్లు స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు 

బందీలుగా17మంది పిల్లలు 

ఈఘటన ముంబైలోని పోవై లో కేసు వెలుగులోకి వచ్చింది,ఇది తీవ్ర కలకలం రేపింది. చిత్రీకరణ ప్రాజెక్ట్ పేరుతో రోహిత్ 17మంది పిల్లలను స్టూడియోకు పిలిపించి బందీలుగా ఉంచాడు. పోలీసులు పిల్లలను సురక్షితంగా రక్షించారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ సత్యనారాయణ చౌదరి ప్రకటించారు. బందీలుగా చేసిన తర్వాత రోహిత్ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో,"నేను రోహిత్ ఆర్య. ఆత్మహత్యకు బదులుగా,నేను ఒక ప్లాన్ ప్రకారం కొంతమంది పిల్లలను బందీలుగా తీసుకున్నాను.నా దగ్గర పెద్దగా డిమాండ్లు లేవు. నా దగ్గర కొన్ని సాధారణ డిమాండ్లు ఉన్నాయి.నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.నేను ఉగ్రవాదిని కాదు.పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం లేదు.నేను ఈ పిల్లలను ఒక సాధారణ సంభాషణ కోసం బందీలుగా తీసుకున్నాను"అని చెప్పాడు.

వివరాలు 

సంఘటనా స్థలంలో మరో ఇద్దరు వ్యక్తులు

గురువారం తెల్లవారుజామున సుమారు 1:45 గంటల సమయంలో స్టూడియోలో ఎయిర్‌గన్‌, కొంత కెమికల్‌ పౌడర్‌ దొరికాయని సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఒంటరిగా ఉన్నాడు.. అతని ఈ చర్య వెనుక కారణం ఏంటో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో మరో ఇద్దరు వ్యక్తులు, అందులో ఒక వృద్ధుడు కూడా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.