Loading...
NITI Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్‌కు కేంద్రం బాధ్యతలు
నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్‌కు కేంద్రం బాధ్యతలు

NITI Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్‌కు కేంద్రం బాధ్యతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ కొత్త ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకానికి కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. ఆయన రెండేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన అనురాగ్ జైన్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల పరిపాలనా అనుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక విధానాల రూపకల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం, పరిపాలనా సంస్కరణల అమలులో విశేష అనుభవాన్ని సంపాదించారు.

వివరాలు 

'వికసిత్ భారత్' లక్ష్యాలకు నాయకత్వం

నీతి ఆయోగ్ సీఈవోగా అనురాగ్ జైన్ కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, వాటి సమర్థవంతమైన అమలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం, దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాల రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

అలాగే 'వికసిత్ భారత్' లక్ష్య సాధనకు అవసరమైన విధానాలను వేగవంతంగా అమలు చేయడంతో పాటు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధికి సంబంధించిన నీతి ఆయోగ్ కార్యక్రమాలకు ఆయన నాయకత్వం వహించనున్నారు.

ADVERTISEMENT