LOADING...
ఉత్తర్‌ప్రదేశ్: భూవివాదంతో కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య
ఉత్తర్‌ప్రదేశ్: భూవివాదంతో కుటుంబంలోని ముగ్గురి హత్య

ఉత్తర్‌ప్రదేశ్: భూవివాదంతో కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2023
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో భూవివాదంలో ఒక వ్యక్తి, అతని కుమార్తె,అల్లుడుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను పదునైన ఆ హత్య చేశారు. స్థానిక నివాసి హోరీలాల్‌కు మరో గ్రామస్థుడు సుభాష్‌తో భూమికి సంబంధించి గొడవ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున హోరీలాల్, అతని కూతురు బ్రిజ్కాలీ, అల్లుడు శివశరణ్‌లను పదునైన ఆయుధంతో సుభాష్‌ హత్య చేశారు. ఈ మూడు హత్యలతో స్థానికులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దింతో వెంటనే స్థానికంగా ఉన్న అనేక ఇళ్ళు, దుకాణాలకు,అలాగే నిప్పు పెట్టారు. నిందితుడి ఇంటికి కూడా నిప్పు పెట్టారు.

Details 

ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు మృతదేహాలను తీసుకెళ్లేందుకు అనుమతించబోమని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఘటనా స్థలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.