Page Loader
SBI: 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ: సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్ 
SBI: 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ: సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్

SBI: 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ: సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్ 

వ్రాసిన వారు Stalin
Mar 13, 2024
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా తరపున ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బ్యాంక్ పాటించిందని ఈ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024వరకు మొత్తం 22,217ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది. 22,030బాండ్లను రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకున్నాయని అఫిడవిట్‌లో పేర్కొంది. మిగిలిన 187 బాండ్ల డబ్బును నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేసినట్లు బ్యాంక్ తెలిపింది. బాండ్ కొనుగోలు తేదీ, కొనుగోలుదారుల పేర్లు, వారి డినామినేషన్ వివరాలను ఈసీకి కూడా అందజేసినట్లు సుప్రీంకోర్టుకు ఎస్‌బీఐ వెల్లడించింది.

#2

ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఇది సమాచార హక్కు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 19(1)(ఎ)ని ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన డేటాను ఈసీకి అందజేయాలని ఎస్‌బీఐని కోర్టు కోరింది. ఈ డేటాను మార్చి 15లోగా ఈసీ తన వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఆదేశించింది. 2017లో కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను ప్రకటించింది. 29 జనవరి 2018న చట్టబద్ధంగా అమలు చేయబడింది. ఎన్నికల విరాళాల్లో 'పారదర్శకత' పెంచడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. 2019లో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.