Bengaluru: నీటిని వృథా చేసిన 22 కుటుంబాలకు రూ.5వేలు జరిమానా
కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి కొరతను ఎదురుకుంటోంది.ఈ క్రమంలోనే నీరు వృధా చేసిన వారిపై ప్రభుత్వం జరిమానాలు వేస్తోంది. తాజాగా, కావేరీ నీటిని అనవసరంగా వాడుకున్నందుకు బెంగళూరు వాటర్ సప్ప్లై అండ్ సెవరేజ్ బోర్డు 22 కుటుంబాలకు రూ.1.10 లక్షలు ఫైన్ (ఒక్క ఫ్యామిలీకి రూ.5వేలు) వేసింది. వారంతా కార్లు కడగటం, తోటకు నీళ్లు పట్టేందుకు తాగునీటిని ఉపయోగించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. BWSSB చట్టంలోని సెక్షన్ 109 ప్రకారం,వాటర్ బోర్డు రూ. 5,000 జరిమానాను ప్రకటించింది. ఇది తదుపరి ఉల్లంఘనలకు రోజుకు రూ. 500కి పెరుగుతుంది. అంతేకాకుండా, బోర్డు నగరంలో నీటి దుర్వినియోగం చేసిన వారిపై ఫిర్యాదు చెయ్యడానికి టోల్-ఫ్రీ నంబర్ 1916 కూడా ఏర్పాటు చేసింది.