NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్
    భారతదేశం

    రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్

    రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 25, 2023, 09:32 am 0 నిమి చదవండి
    రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్
    రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్

    రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత సైన్యం చేస్తున్న ఫీల్డ్ ప్రాక్టీస్‌లో అపశృతి చోటు చేసుకుంది. సైన్యం ప్రయోగించిన మూడు క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయి. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ జరగుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ఉపరితలంతో పాటు గగనతలం నుంచి ప్రయోగించే మూడు మిస్సైల్స్ మిస్ ఫైర్ అయినట్లు అధికారులు వెల్లడించారు. మూడు క్షిపణులు నిర్దేశిత పరిధి దాటి వెళ్లి వేర్వేరు గ్రామాల్లోని పొలాల్లోకి దూసుకెళ్లడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

    విచారణకు ఆదేశించిన అధికారులు

    సైనికుల ప్రాక్టీస్ సందర్భంగా మిస్సైల్‌లు మిస్ ఫైర్ అయ్యాయని రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అమితాబ్ శర్మ తెలిపారు. విచారణ ప్రారంభించామని, తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మిస్ ఫైర్ అయిన రెండు క్షిపణుల శిథిలాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మూడోదాని కోసం పోలీసులు, ఆర్మీ బృందాలు వెతుకుతున్నాయి. 10 నుంచి 25 కిలోమీటర్ల పరిధిలోని క్షిపణులను సైన్యంలోని నిపుణులు పరీక్షించారు. కానీ సాంకేతిక లోపం కారణంగా అవి వాటి పరిధిని దాటి ఇంకా ఎక్కువ దూరం దూసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. నాచన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కైలాష్ విష్ణోయ్ ఈ సంఘటనను ధృవీకరించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    రాజస్థాన్
    ఆర్మీ
    ఇండియా లేటెస్ట్ న్యూస్
    తాజా వార్తలు

    రాజస్థాన్

    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం  ఎన్నికల సంఘం
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  నరేంద్ర మోదీ
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ అశోక్ గెహ్లాట్
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి యుద్ధ విమానాలు

    ఆర్మీ

    ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు  పాకిస్థాన్
    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి పాకిస్థాన్
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  మణిపూర్
    ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి ఉగ్రవాదులు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక  టర్కీ
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  తెలంగాణ

    తాజా వార్తలు

    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  తెలంగాణ
    PWC India report: 2026-27 నాటికి 90శాతం యూపీఐ చెల్లింపులే చెల్లింపు
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  కర్నూలు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023