NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం
    అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 09, 2023
    06:35 pm
    అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం
    అక్రమ మైనింగ్ తో కుప్పకూలిన బొగ్గుగని.. అక్కడిక్కడే ముగ్గురి దుర్మరణం

    ఓ బొగ్గు గని కుప్పకూలిన ఘోర ఘటన జార్ఖండ్‏ రాష్ట్రంలోని ధన్‎బాద్‎లో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందడం కోల్ మైన్స్ లో కలకలం రేపుతోంది. దేశంలోనే అధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాల్లో జార్ఖండ్ కు పేరు ఉంది. ఇక్కడ నాణ్యమైన సీ గ్రేడ్ బొగ్గు దొరుకుంది. మరోవైపు పలువురు కార్మికులు బొగ్గు గని శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చు అని కార్మికులు, అధికారులు అనుమానిస్తున్నారు. ఓవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ టీమ్ కృషి చేస్తోందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బొగ్గు తవ్వకాలు అక్రమంగా జరుపుతున్నందునే భద్రతా ప్రమాణాలు లేక ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది.

    2/2

    సహాయక చర్యలు కొనసాగుతున్నాయి : డీఎస్పీ

    బొగ్గు గని కూలిన ఘటన సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం రెస్క్యూ బృందంతో కలిసి సహాయక చర్యలను ప్రారంభించారు. కోల్ మైనింగ్ సంస్థ ఖనిజాలను వెలికితీసేందుకు బొగ్గుగనికి సమీపంలో నివసిస్తున్న పలు గ్రామాల ప్రజలను సదరు కంపెనీ నియమించుకుందని సింధ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ కుమార్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే శిథిలాల నుంచి స్థానికులు, ముగ్గురిని బయటకు వెలికితీసి వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈ ముగ్గురు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారని డీఎస్పీ స్పష్టం చేశారు. శిథిలాల వద్ద పూర్తిస్థాయిలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నామని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    జార్ఖండ్

    జార్ఖండ్

    నక్సల్స్ సానుభూతిపరులే లక్ష్యంగా జార్ఖండ్, బిహార్‌లోని ఏడు చోట్ల ఎన్ఐఏ దాడులు  ఎన్ఐఏ
    రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్  రైలు ప్రమాదం
    పీఎల్‌ఎఫ్‌ఐ టెర్రర్ ఫండింగ్ కేసు: జార్ఖండ్‌లో ఎన్‌ఐఏ సోదాలు; ఆయుధాలు స్వాధీనం  ఉగ్రవాదులు
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023