
దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు
ఈ వార్తాకథనం ఏంటి
అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు సెలవులు ప్రకటించింది. కేంద్ర కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులను మంజూరు చేసింది.
సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు దిల్లీలోని అన్ని కేంద్రీయ కార్యాలయాలూ మూసే ఉంటాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలిచ్చింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు, ప్రభుత్వ ఆఫీసులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
సెప్టెంబరు 8 నుంచి 10 వరకు G-20 సమావేశాలు జరగనుండగా, సభ్య దేశాల అధినేతల భేటీ 9, 10 తేదీల్లో జరగడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు
Delhi declares holiday from 8-10 Sept as the city hosts the G20 Summit. pic.twitter.com/XqBCTiMdXU
— Sidhant Sibal (@sidhant) August 24, 2023