NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamilnadu: తమిళనాడులో సభ్యసమాజం తల దించుకునే ఘటన.. విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం 
    తదుపరి వార్తా కథనం
    Tamilnadu: తమిళనాడులో సభ్యసమాజం తల దించుకునే ఘటన.. విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం 
    విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం

    Tamilnadu: తమిళనాడులో సభ్యసమాజం తల దించుకునే ఘటన.. విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2025
    11:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా దిశానిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు.

    ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కృష్ణగిరి జిల్లాలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చోటు చేసుకుంది.

    కృష్ణగిరి కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

    జనవరి 3వ తేదీ నుండి బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. దీంతో నెల రోజులుగా పాఠశాలకు ఎందుకు రావడం లేదంటూ ప్రిన్సిపల్‌ నేరుగా బాలిక ఇంటికి వెళ్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

    ఈ బాలిక ప్రస్తుతం గర్భవతి అయ్యింది.

    వివరాలు 

    ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

    పాఠశాల యాజమాన్యం సూచనపై, బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనను బర్గూర్‌ ఆల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    పోలీసులు, బాలిక కుటుంబాన్ని చైల్డ్ సేఫ్టీ అధికారితో సంప్రదింపులు చేపడితే, వారు కౌన్సెలింగ్ ఇచ్చారు.

    ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    RBI Interest Rates: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. ముచ్చటగా మూడోసారి వడ్డీ రేట్లు 0.50% తగ్గింపు ఆర్ బి ఐ
    Bangalore Stampede: బెంగళూరు నగర పోలీసు కమిషనర్ తోపాటు పలువురు పోలీసులు సస్పెండ్.. కొత్త క‌మీష‌న‌ర్‌గా సీమంత్ కుమార్ సింగ్‌ బెంగళూరు
    Shine Tom Chacko:సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. 'దసరా' విల్లన్ ఇంట విషాదం మాలీవుడ్
    Stock Market : ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తం.. స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు స్టాక్ మార్కెట్

    తమిళనాడు

    CM Stalin: హోటల్ యజమాని క్షమాపణలు చెప్పడంపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు  ఇండియా
    Tamil Nadu Governor: లౌకిక వాదంపై తీవ్ర విమర్శలు చేసిన తమిళనాడు గవర్నర్ గవర్నర్
    Gangrape: తమిళనాడులో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఇండియా
    Siddaramaiah: భయపడను.. కుంభకోణంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  సిద్ధరామయ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025