NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pune Porsche accident: పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ .. రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం 
    తదుపరి వార్తా కథనం
    Pune Porsche accident: పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ .. రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం 
    రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం

    Pune Porsche accident: పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ .. రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం 

    వ్రాసిన వారు Stalin
    May 28, 2024
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పూనే పోర్ష్ కారు ప్రమాద ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. టీనేజ్ యువకుడ్ని తప్పించటానికి అతని కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు.

    ఘటన గురించి తెలియగానే రక్తపు శాంపిళ్లను తారు మారు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పథకాన్నినడిపారు.

    ఫోర్సెనిక్ ల్యాబరేటరీ డాక్టర్లకు 3 లక్షలు లంచం ఇవ్వచూపారు. దీనికి ప్యూన్ అతుల్ ఘట్కాంబల్లే మధ్య దళారీగా వ్యవహరించాడు.

    దీనిని ఇద్దరు డాక్టర్లకు ప్యూన్ ఇచ్చాడు.అంతకు ముందు ఇద్దరు డాక్టర్లతో టీనేజ్ యువకుడి తండ్రి మాట్లాడాడు.

    అంతే డబ్బులు చేతిలో పడగానే డాక్టర్ల బుర్ర చురుగ్గా పని చేయటం ప్రారంభించింది. ఆదివారం ఉదయం 11 గంటలకు సస్సాన్ ఆసుపత్రిలో టీనేజ్ యువకుడు రక్తపు నమూనాలు ఇచ్చాడు .

    Details 

    ఏకంగా శాంపిళ్లనే మార్చేశారు 

    ఆసుపత్రి ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీహరి హల్నార్ , సూచనకు అనుగుణంగా ల్యాబరేటరీ ఇన్ ఛార్జి అజయ్ తవాడే వాటిని మార్చేశారని తెలుస్తోంది.

    కాగా ముందుగా ఇచ్చిన శాంపిళ్లను చెత్త బుట్టలో పడేశారు. ఆ శాంపిళ్ల ప్రకారం రూపొందించిన రిపోర్ట్ మద్యం తాలూకు ఆనవాళ్లు లేవని తెలిపింది.

    దీనిపై అనుమానం వచ్చిన పూనే క్రైంబ్రాంచ్ పోలీసులు వేరే ల్యాబ్ కి పంపారు.

    వాటిలో మాత్రం మద్యం తాలూకు ఆనవాళ్లు ఉన్నాయని తేల్చింది. దీంతో అనుమానం మరింతగా బలపడటంతో ఇద్దరు డాక్టర్లను పూనే క్రైంబ్రాంచ్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు.

    ఈ కేసులో ప్యూన్ కూడా అరెస్ట్ అయ్యాడు.

    Details 

    ఏ ఒక్కరినీ వదలబోం: పూనే పోలీసు కమిషనర్ 

    ఇదిలా వుంటే దీనికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని పూనే పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తేల్చి చెప్పారు.

    మరో మలుపు ఏమంటే సిసి టివి ఫూటేజీని తనిఖీ చేస్తే టీనేజ్ యువకుడు బార్ లో మద్యం సేవించాడని చూపుతోంది.

    మే19నాటి ప్రమాద ఘటనలో ఇద్దరు ఐటి ఉద్యోగులు బైక్ పై నుంచి కింద పడి చనిపోయారు. ఆ సమయంలో పోర్ష్ కారు వేగం 200 కిలో మీటర్లు గా నమోదైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    మహారాష్ట్ర

    Maharashtra: ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. స్పీకర్‌కు బాంబై హైకోర్టు నోటీసులు  ఏక్‌నాథ్ షిండే
    Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు తాజా వార్తలు
    Cannibalism: తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో అరుదైన ఘటన.. పులి పిల్లల్ని చంపి తింటున్నపెద్ద పులి  భారతదేశం
    Maratha Reservation: మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి దిగొచ్చిన సర్కార్.. దీక్షను విరమించిన మనోజ్ జరంగే మరాఠా రిజర్వేషన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025