LOADING...
Bengaluru: బెంగళూరులోని 40 పాఠశాలలకు బాంబు బెదిరింపులు
బెంగళూరులోని 40 పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Bengaluru: బెంగళూరులోని 40 పాఠశాలలకు బాంబు బెదిరింపులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక వైపు దేశ రాజధానిలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్న సమయంలో,మరో వైపు బెంగళూరు నగరంలో కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం బెంగళూరులో ఒకేసారి 40 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్స్‌ అందాయి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. రాజరాజేశ్వరి నగర్‌, కెంగేరి సహా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా దృష్ట్యా ఆ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించారు. పోలీస్‌ శాఖ ప్రత్యేక బృందాలుగా విభజించి ఆయా విద్యాసంస్థల్లో సమగ్ర తనిఖీలు నిర్వహిస్తోంది.

వివరాలు 

 ఢిల్లీలో 20 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు

బాంబు స్క్వాడ్‌ బృందాలు ఘటనాస్థలాలకు చేరుకుని శ్రద్ధతో పరిశీలిస్తున్నాయి. ఇక ఢిల్లీలో కూడా పరిస్థితి అలానే కొనసాగుతోంది. అక్కడ 20 పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. అక్కడ కూడా పోలీసులు, బాంబు స్క్వాడ్‌ బృందాలు సమగ్ర తనిఖీలు చేపట్టారు. ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఫోన్లు, ఈమెయిల్స్‌ సంఖ్య గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు ప్రధాన లక్ష్యంగా మారుతున్నట్టు అధికారులు గుర్తించారు.