
Uttarakhand Tunnel: 17 రోజుల తర్వాత సొరంగం నుండి సురక్షితంగా బయటకువచ్చిన 41 మంది కార్మికులు
ఈ వార్తాకథనం ఏంటి
17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను ఎట్టకేలకు బయటకు వచ్చారు.
చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి చెందిన మూడు బృందాలు సొరంగం లోపలికి వెళ్లి 41 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
రెస్క్యూ సైట్లో ఉన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి,బయటకు వచ్చిన కార్మికులను కలిసి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా ఉన్నారు.
సొరంగంలోని కార్మికులను రక్షించిన వెంటనే, వారిని వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
చిక్కుకున్న కార్మికులను తరలించడానికి ఉపయోగించే అంబులెన్స్ను చిన్యాలిసౌర్లో ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సదుపాయాలకు చేరుకోవడానికి "గ్రీన్ కారిడార్"ఏర్పాటు చేశారు.
Details
సొరంగం కూలిపోయిన వెంటనే, రెస్క్యూ ఆపరేషన్
నవంబర్ 12న, ఉత్తరకాశీలో సొరంగంలోని ఒక భాగం కూలిపోయింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో సొరంగం లోపల 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు.
సొరంగం కూలిపోయిన వెంటనే, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది, రక్షకులు, నిపుణులు, ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటి నుండి కార్మికులకు బయటి నుంచి గొట్టం ద్వారా తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ పంపించడంతో వారు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది.
బయటకు వచ్చిన కార్మికులను చుసిన కుటుంబసభ్యులు అంతా భావోద్వేగానికి గురయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है।
— Narendra Modi (@narendramodi) November 28, 2023
टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं।
यह अत्यंत…
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ట్వీట్
I feel relieved and happy to learn that all the workers trapped in a tunnel in Uttarakhand have been rescued. Their travails over 17 days, as the rescue effort met with obstacles, have been a testament of human endurance. The nation salutes their resilience and remains grateful…
— President of India (@rashtrapatibhvn) November 28, 2023