NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarakhand Tunnel: 17 రోజుల తర్వాత సొరంగం నుండి సురక్షితంగా బయటకువచ్చిన 41 మంది కార్మికులు  
    తదుపరి వార్తా కథనం
    Uttarakhand Tunnel: 17 రోజుల తర్వాత సొరంగం నుండి సురక్షితంగా బయటకువచ్చిన 41 మంది కార్మికులు  

    Uttarakhand Tunnel: 17 రోజుల తర్వాత సొరంగం నుండి సురక్షితంగా బయటకువచ్చిన 41 మంది కార్మికులు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2023
    09:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను ఎట్టకేలకు బయటకు వచ్చారు.

    చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి చెందిన మూడు బృందాలు సొరంగం లోపలికి వెళ్లి 41 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

    రెస్క్యూ సైట్‌లో ఉన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి,బయటకు వచ్చిన కార్మికులను కలిసి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా ఉన్నారు.

    సొరంగంలోని కార్మికులను రక్షించిన వెంటనే, వారిని వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

    చిక్కుకున్న కార్మికులను తరలించడానికి ఉపయోగించే అంబులెన్స్‌ను చిన్యాలిసౌర్‌లో ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సదుపాయాలకు చేరుకోవడానికి "గ్రీన్ కారిడార్"ఏర్పాటు చేశారు.

    Details 

    సొరంగం కూలిపోయిన వెంటనే, రెస్క్యూ ఆపరేషన్

    నవంబర్ 12న, ఉత్తరకాశీలో సొరంగంలోని ఒక భాగం కూలిపోయింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో సొరంగం లోపల 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు.

    సొరంగం కూలిపోయిన వెంటనే, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది, రక్షకులు, నిపుణులు, ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    అప్పటి నుండి కార్మికులకు బయటి నుంచి గొట్టం ద్వారా తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ పంపించడంతో వారు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది.

    బయటకు వచ్చిన కార్మికులను చుసిన కుటుంబసభ్యులు అంతా భావోద్వేగానికి గురయ్యారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

    उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है।

    टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं।

    यह अत्यंत…

    — Narendra Modi (@narendramodi) November 28, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ట్వీట్ 

    I feel relieved and happy to learn that all the workers trapped in a tunnel in Uttarakhand have been rescued. Their travails over 17 days, as the rescue effort met with obstacles, have been a testament of human endurance. The nation salutes their resilience and remains grateful…

    — President of India (@rashtrapatibhvn) November 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఉత్తరాఖండ్

    అమర్‌నాథ్‌ భక్తులకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన బోర్డు భారతదేశం
    ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్ వర్షాకాలం
    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర  భారీ వర్షాలు
    Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025