NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి
    భారతదేశం

    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి

    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 13, 2023, 01:23 pm 1 నిమి చదవండి
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి
    జోషిమఠ్‌‌ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసిన ఇస్రో

    రోజుకు కొంత మునిగిపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ పట్టణం గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన విషయాలను వెల్లడించింది. జోషిమఠ్‌‌లో భూమి నెమ్మదిగా కుంగిపొతోందని, దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. డిసెంబర్ 27, 2022 నుంచి జనవరి 8, 2023(12రోజుల్లో) మధ్య జోషిమఠ్‌ పట్టణంలో 5.4 సెం.మీ మేర కుంగిపోయినట్లు తన తాజాగా నివేదికలో ఇస్రో పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 9 సెంటీమీటర్ల మేర మునిగిపోయినట్లు చెప్పింది. ఈ గణాంకాలను పరిశీలంచగా జోషిమఠ్‌‌లో భూమి చాలా వేగంగా కుంగిపోతోందని వివరించింది. 2180 మీటర్ల ఎత్తులో జోషిమఠ్-ఔలీ రహదారి సమీపంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు ఇస్రో తన నివేదికలో చెప్పింది.

    కొన్ని పట్టణాల్లో ఏటా 2.5 అంగులాల భూమి కుంగిపోతోంది: శాస్త్రవేత్తలు

    ఉత్తరాఖండ్‌లోని కొన్ని పట్టణాలు కూడా మనిగిపోయే పరిస్థితుల్లో ఉన్నట్లు డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ పట్టణాల్లో ప్రతి సంవత్సరం కొంత భూమి కుంగిపోతున్నట్లు గుర్తించారు. జోషిమఠ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏటా 2.5 అంగులాల మేరకు భూమి కుంగిపోతున్నట్లు పేర్కొన్నారు. పగుళ్లు వచ్చిన ఇళ్లలోని ప్రజలను ఆర్మీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు. అవసరమైతే మరింత మంది ఆర్మీ సిబ్బందిని జోషిమఠ్‌కు పంపుతామని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వం ఎన్టీపీసీతోపాటు రైల్వే ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇలాంటి మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఉత్తరాఖండ్
    ఇస్రో

    తాజా

    సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్‌తో చెత్త రికార్డు సూర్యకుమార్ యాదవ్
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్ వ్యాపారం
    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ తెలుగు సినిమా
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే విశాఖపట్టణం

    ఉత్తరాఖండ్

    ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే? ఇండియా లేటెస్ట్ న్యూస్
    ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి రోడ్డు ప్రమాదం
    ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం భారతదేశం
    జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం జమ్ముకశ్మీర్

    ఇస్రో

    మేలో గగన్యాన్ విమాన పరీక్షను ప్రారంభించనున్నఇస్రో అంతరిక్షం
    2030 నాటికి భారతీయుల కోసం స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ భారతదేశం
    రేపు శాటిలైట్ రీ-ఎంట్రీ ప్రయోగాన్ని నిర్వహించనున్న ఇస్రో ప్రయోగం
    చంద్రయాన్-3 కీలక రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో చంద్రుడు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023