NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి
    తదుపరి వార్తా కథనం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి
    జోషిమఠ్‌‌ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసిన ఇస్రో

    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి

    వ్రాసిన వారు Stalin
    Jan 13, 2023
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రోజుకు కొంత మునిగిపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ పట్టణం గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన విషయాలను వెల్లడించింది. జోషిమఠ్‌‌లో భూమి నెమ్మదిగా కుంగిపొతోందని, దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.

    డిసెంబర్ 27, 2022 నుంచి జనవరి 8, 2023(12రోజుల్లో) మధ్య జోషిమఠ్‌ పట్టణంలో 5.4 సెం.మీ మేర కుంగిపోయినట్లు తన తాజాగా నివేదికలో ఇస్రో పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 9 సెంటీమీటర్ల మేర మునిగిపోయినట్లు చెప్పింది. ఈ గణాంకాలను పరిశీలంచగా జోషిమఠ్‌‌లో భూమి చాలా వేగంగా కుంగిపోతోందని వివరించింది.

    2180 మీటర్ల ఎత్తులో జోషిమఠ్-ఔలీ రహదారి సమీపంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు ఇస్రో తన నివేదికలో చెప్పింది.

    జోషిమఠ్‌‌

    కొన్ని పట్టణాల్లో ఏటా 2.5 అంగులాల భూమి కుంగిపోతోంది: శాస్త్రవేత్తలు

    ఉత్తరాఖండ్‌లోని కొన్ని పట్టణాలు కూడా మనిగిపోయే పరిస్థితుల్లో ఉన్నట్లు డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ పట్టణాల్లో ప్రతి సంవత్సరం కొంత భూమి కుంగిపోతున్నట్లు గుర్తించారు. జోషిమఠ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏటా 2.5 అంగులాల మేరకు భూమి కుంగిపోతున్నట్లు పేర్కొన్నారు.

    పగుళ్లు వచ్చిన ఇళ్లలోని ప్రజలను ఆర్మీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు. అవసరమైతే మరింత మంది ఆర్మీ సిబ్బందిని జోషిమఠ్‌కు పంపుతామని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు.

    హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వం ఎన్టీపీసీతోపాటు రైల్వే ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇలాంటి మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    ఇస్రో

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం

    ఇస్రో

    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025