NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక
    భారతదేశం

    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక

    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 11, 2023, 10:23 am 1 నిమి చదవండి
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక
    హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయని నిపుణుల హెచ్చరిక

    ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 723కి చేరుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 131 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే జోషిమఠ్‌ మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జోషిమఠ్‌తో ఆగిపోదని, రాబోయే సంవత్సరాల్లో అనేక హిమాలయ పట్టణాలు, గ్రామాలు మునిగిపోతాయని పర్యావరణ నిపుణుడు విమ్లెందు ఝా హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో 66కుపైగా సొరంగాలు నిర్మించినట్లు, దశాబ్దాలుగా డ్యామ్‌లు నిర్మిస్తున్నారని విమ్లెందు ఝా చెప్పారు. నిర్మాణాలు చేపట్టొద్దని నిపుణులు హెచ్చరిస్తున్న ప్రభుత్వం వినిపించుకోలేదని నాన్‌స్టాప్‌గా తవ్వడం, భూగర్భంలో బ్లాస్టింగ్ చేయడం వల్లే.. వినాశానికి కారణమవుతోందని ఝా ట్వీట్‌ పేర్కొన్నారు.

    '5దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నా వినలేదు'

    హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ఎన్టీపీసీతోపాటు రైల్వే ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. మైదాన ప్రాంతాల్లో నిర్మాణాల్లో చేపట్టినట్లు హిమాలయాల్లో చేపట్టడానికి పర్యావరణం అనుకూలించదని, ఇదే విషయాన్ని నిపుణులు గత 5దశాబ్దాలుగా చెబుతున్నారని విమ్లెందు ఝా చెప్పారు. దిల్లీ లేదా మైదాన ప్రాంతాలతో హిమాలయాలను పోల్చలేమన్నారు. హిమాలయ ప్రాంతాలు చాలా సున్నితమైనవని, వాటిని అలాగే ఉంచాలని ఝా పేర్కొన్నారు. జోషిమఠ్‌లో ఇళ్ల కూల్చివేతలో రాష్ట్ర ప్రభుత్వానికి రూర్కీ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహాయం చేస్తోంది. జోషిమఠ్‌లో కూల్చివేతకు సంబంధించి దాఖలైన అత్యవసర విచారణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై ఈ నెల 16న విచారణ చేపడతామని చెప్పింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్‌తో చెత్త రికార్డు సూర్యకుమార్ యాదవ్
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్ వ్యాపారం
    తన పోస్టర్ రిలీజ్ చేయలేదని కోపం తెచ్చుకున్న సంయుక్త, స్పందించిన నిర్మాణ సంస్థ తెలుగు సినిమా
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే విశాఖపట్టణం

    ఉత్తరాఖండ్

    ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే? ఇండియా లేటెస్ట్ న్యూస్
    ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి రోడ్డు ప్రమాదం
    ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం భారతదేశం
    జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం జమ్ముకశ్మీర్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023