Loading...
Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు
జమ్మూకశ్మీర్‌లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు

Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో గురువారం ఉదయం భూమి కంపించింది. లేహ్‌ ప్రాంతంలో ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ (NCS) వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతాన్ని, కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ పేర్కొంది.

వివరాలు 

ఎక్స్‌ వేదికగా వివరాలను వెల్లడించిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వివరాలను వెల్లడించింది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది.

భూకంపాలు భూమి ఉపరితలం నుంచి వివిధ లోతుల్లో చోటుచేసుకునే అవకాశం ఉందని వివరించింది.

యూఎస్‌జీఎస్‌ (USGS) డేటా ప్రకారం.. భూమి ఉపరితలం నుంచి 0 నుంచి 700 కిలోమీటర్ల లోతు వరకు భూకంపాలు సంభవించవచ్చని పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మాలజీ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT