NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chennai air show: చెన్నైలో వైమానిక దళ ఎయిర్‌ షోలో విషాదానికి తొక్కిసలాట కారణం కాదు: డీఎంకే
    తదుపరి వార్తా కథనం
    Chennai air show: చెన్నైలో వైమానిక దళ ఎయిర్‌ షోలో విషాదానికి తొక్కిసలాట కారణం కాదు: డీఎంకే
    చెన్నైలో వైమానిక దళ ఎయిర్‌ షోలో విషాదానికి తొక్కిసలాట కారణం కాదు: డీఎంకే

    Chennai air show: చెన్నైలో వైమానిక దళ ఎయిర్‌ షోలో విషాదానికి తొక్కిసలాట కారణం కాదు: డీఎంకే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 07, 2024
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులోని మెరీనా బీచ్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన వైమానిక దళ ఎయిర్ షోలో చోటుచేసుకున్న దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి

    ఈ ఘటనకు కారణం తొక్కిసలాట లేదా నిర్వహణ లోపం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

    డీఎంకే నేత శరవణన్ అన్నాదురై ప్రకటనలో, ఆస్పత్రిలో చేరిన చాలామంది డిశ్చార్జి అయ్యారని, ఇంకా చికిత్స పొందుతున్న ఇద్దరు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

    ఈ షో విస్తృత ప్రచారం పొందింది, తద్వారా సుమారు 15 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారని రక్షణ దళాలు పేర్కొన్నాయి.

    బీచ్ రోడ్డుపై 14-15 కిలోమీటర్ల మేర జనాలు గుమిగూడారు,తాగునీటి సౌకర్యం లేకపోవడం,ఎండ తీవ్రత వల్ల ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.

    వివరాలు 

    అన్నాడీఎంకే,బీజేపీ తీవ్ర విమర్శలు 

    ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించేందుకు కొందరు సబర్బన్, మెట్రో రైళ్లు ఆశ్రయించగా, అక్కడ కూడా తోపులాటలు జరిగాయి.

    ఈ ఘటనపై అన్నాడీఎంకే,బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. సమన్వయం లోపం, తగిన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నాడీఎంకే నేత పళనిస్వామి ధ్వజమెత్తారు.

    ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా ఇతర ముఖ్య నాయకుల రాజీనామా కోరాయి.

    డీఎంకే నాయకుడు శరవణన్ దీనిపై స్పందిస్తూ, షో నిర్వహణలో ఎటువంటి లోపం లేదని,ఐదుగురు మృతి చెందిన కారణాలు పరిశీలిస్తున్నామని చెప్పారు.

    ఈ ప్రమాదానికి అధిక ఉష్ణోగ్రతలు,రద్దీ కారణం అయ్యాయని ఆయన వివరించారు.

    అలాగే,డీఎంకే ఎంపీ కనిమొళి ఈ ఘటనపై స్పందిస్తూ, రద్దీ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా మృత్యువులు చోటుచేసుకోవడం చాలా బాధాకరమని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    చెన్నై

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    తమిళనాడు

    MP Ganeshamurthi: తమిళనాడు ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో మృతి  భారతదేశం
    TamilNadu: తమిళనాడులో ఏఐఏడీఎంకేకు ఏఐఎంఐఎం మద్దతు అసదుద్దీన్ ఒవైసీ
    Srisrinivasan Died: నటుడు కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం...మామగారు శ్రీశ్రీనివాసన్ కన్నుమూత కమల్ హాసన్
    Telangana-VCK Pary-Tamil Party: తెలంగాణ బరిలో తమిళ పార్టీ వీసీకే పోటీ..మూడు సీట్లలో నామినేషన్లు దాఖలు తెలంగాణ

    చెన్నై

    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన అమెరికా
    ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్ తమిళనాడు
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025