
Ayodhya: అయోధ్యలో ఘోర ప్రమాదం.. పేలుడు ధాటికి కూలిన భవనం, ఐదుగురి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శక్తివంతమైన పేలుడు సంభవించడంతో ఓ ఇల్లు పూర్తిగా కూలిపోయి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన గురువారం రాత్రి పాగ్లా భరి గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. ఈ గ్రామం పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. రాత్రి వేళ ఎవరూ ఊహించని స్థాయిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో రెండు అంతస్థుల భవనం కుప్పకూలి పోయింది. పేలుడు తీవ్రతకు ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఇంకా కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు స్థానిక అధికారులు, సహాయక బృందాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని సర్కిల్ ఆఫీసర్ (సీఓ) శైలేంద్ర సింగ్ వెల్లడించారు.
వివరాలు
అయోధ్య ప్రజల్లో భయాందోళనలు
అయితే ఈ పేలుడుకు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు తెలిపారు. సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పరిపాలన అధికారులు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ భారీ పేలుడు వార్తతో అయోధ్య ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అనుకోకుండా జరిగిన ఈ ఘోర ఘటనతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అయోధ్యలో ఘోర ప్రమాదం.. పేలుడు ధాటికి కూలిన భవనం
#WATCH | Uttar Pradesh: 5 people died following an explosion in a house in Ayodhya. Police and administration are at the spot, and rescue and search operations are underway. pic.twitter.com/JbPA21Nden
— ANI (@ANI) October 9, 2025