NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / West Bengal:పశ్చిమ బెంగాల్‌లో తుఫాను విధ్వంసం.. 5 గురు మృతి, 100 మందికిపైగా  గాయాలు
    తదుపరి వార్తా కథనం
    West Bengal:పశ్చిమ బెంగాల్‌లో తుఫాను విధ్వంసం.. 5 గురు మృతి, 100 మందికిపైగా  గాయాలు
    పశ్చిమ బెంగాల్‌లో తుఫాను విధ్వంసం.. 5 గురు మృతి, 100 మందికిపైగా గాయాలు

    West Bengal:పశ్చిమ బెంగాల్‌లో తుఫాను విధ్వంసం.. 5 గురు మృతి, 100 మందికిపైగా  గాయాలు

    వ్రాసిన వారు Stalin
    Apr 01, 2024
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వచ్చిన భయంకరమైన తుఫాను ఆ ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించింది.

    జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వడగళ్ల వానతో కూడిన బలమైన గాలుల కారణంగా పలు గుడిసెలు, ఇళ్లు దెబ్బతిన్నాయి, చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

    ఈ తుపాను కారణంగా ఇప్పటివరకు 5 మంది మరణించగా, 500 మంది గాయపడ్డారు.

    అయితే, ఆదివారం ఏరియా మేజిస్ట్రేట్ షామా పర్వీన్ 4 మంది మరణించినట్లు చెప్పారు. కాగా ఇప్పుడు మరో మహిళ మృతిని కూడా ధృవీకరించారు.

    ఇక, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తుఫాన్ వార్తలపై స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం, ఈదురు గాలులు జల్‌పైగురి-మైనాగురిలోని కొన్ని ప్రాంతాలలో భారీ నష్టం వాటిలిందన్నారు.

    మమతా బెనర్జీ 

    తుపాను కారణంగా  లక్షలాది చెట్లు నేలకూలాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి

    ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతో పాటు అనేక మంది గాయపడ్డ వారి కుటుంబాలకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తన సానుభూతి తెలిపారు.

    సీఎం తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఆదివారం రాత్రి జల్పాయ్ గురి చేరుకున్నారు.

    ఆ ప్రాంతాన్ని పరిశీలించి, తుఫాను కారణంగా ప్రభావితమైన ప్రజలను కలుసుకునేందుకు జల్పైగురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా సందర్శించారు.

    ఆదివారం పశ్చిమ బెంగాల్‌ను తాకిన తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది.మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో తుపాను వచ్చి దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది.

    ఇందులో లక్షలాది చెట్లు నేలకూలాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ తుపాను కారణంగా 5 మంది మరణించగా, 500 మంది గాయపడినట్లు సమాచారం.

    షామా పర్వీన్

    బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది: మమతా 

    అంతకుముందు ఆదివారం, జల్పైగురి జిల్లా మేజిస్ట్రేట్ షామా పర్వీన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు నలుగురు మరణించారని, మృతులను ద్విజేంద్ర నారాయణ్ సర్కార్ (52), అనిమా రాయ్ (49), జోగెన్ రాయ్ (70), సమర్ రాయ్ (64)గా గుర్తించారు.

    కాగా, తుపాను కారణంగా ఓ మహిళ కూడా చనిపోయిందని వార్తలు వచ్చాయి.

    మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, విపత్తు సంభవించిందని, దాని కారణంగా చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయని ,ఐదుగురు మరణించారని అన్నారు.

    ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాలనా యంత్రాంగం అక్కడే ఉందని, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

    బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మమతా బెనర్జీ చేసిన ట్వీట్ 

    Sad to know that sudden heavy rainfall and stormy winds brought disasters today afternoon in some Jalpaiguri-Mainaguri areas, with loss of human lives, injuries, house damages, uprooting of trees and electricity poles etc.

    District and block administration, police, DMG and QRT…

    — Mamata Banerjee (@MamataOfficial) March 31, 2024

    నరేంద్ర మోదీ 

    ఆకస్మిక తుఫానుపై స్పందించిన ప్రధాని మోదీ 

    అంతకుముందు ఆదివారం, జల్పాయిగురి జిల్లాలో తుఫాను సృష్టించిన విధ్వంసంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

    ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి-మైనాగురి ప్రాంతాల్లో తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలకు నా సానుభూతి అని మోదీ రాశారు.

    తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బాధిత ప్రజలను ఆదుకోవాలని నేను బెంగాల్ బిజెపి కార్యకర్తలందరినీ కూడా కోరుతాను అని ప్రధాని చెప్పారు.

    గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా బాధిత ప్రాంతాలను సందర్శించేందుకు సోమవారం జల్పాయ్‌గురికి వెళ్లనున్నట్లు రాజ్‌భవన్ అధికారులు తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

    My thoughts are with those affected by the storms in Jalpaiguri-Mainaguri areas of West Bengal. Condolences to those who have lost their loved ones.

    Spoke to officials and asked them to ensure proper assistance to those impacted by the heavy rains.

    I would also urge all…

    — Narendra Modi (@narendramodi) March 31, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    తుపాను

    తాజా

    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్

    పశ్చిమ బెంగాల్

    ఉపపోరు: 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలు
     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    దిల్లీలో బెంగాల్ వ్యాపారి కిడ్నాప్.. ముగ్గురు అరెస్ట్ దిల్లీ
    UGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే? యూనివర్సిటీ

    తుపాను

    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు ఐఎండీ
    మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు  బంగ్లాదేశ్
    రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్  ఐఎండీ
    అతితీవ్ర తుపానుగా బిప‌ర్‌జాయ్.. తీత‌ల్ బీచ్‌ మూసివేత గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025