Page Loader
Naxalites surrender: ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన
ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన

Naxalites surrender: ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌ బిజాపూర్‌ జిల్లాలో పెద్ద ఎత్తున నక్సలైట్లు లొంగిపోయారు. మొత్తం 50 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 14 మంది తలపై కలిపి రూ.68 లక్షల రివార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు కొద్ది గంటల ముందు ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లలో ఆరుగురికి ఒక్కొక్కరిపై రూ.8 లక్షల రివార్డు, ముగ్గురికి రూ.5 లక్షలు, మరో ఐదుగురికి రూ.1 లక్ష రివార్డు ఉంది. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), జిల్లా రిజర్వ్‌ గార్డు (డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) ఈ లొంగుబాటులో కీలక పాత్ర పోషించాయి.

Details

గతేడాది 25 మంది లొంగుబాటు

మావోయిస్టు ఉద్యమంలో విభేదాలు, ప్రభుత్వ పునరావాస విధానాలు కూడా ఈ నిర్ణయానికి కారణమైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పునరావాస పథకం కింద లొంగిపోయిన వారికి సహాయ కార్యక్రమాలు అందించనున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోదీ తన పర్యటనలో రూ.33,700 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇదే ప్రాంతంలో గతేడాది ఆగస్టులోనూ 25 మంది నక్సలైట్లు లొంగిపోగా, వారిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డులు ఉన్నాయి. మొత్తం బస్తర్‌ ప్రాంతంలో 2023లో 790 మందికిపైగా నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు.