NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Naxalites surrender: ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Naxalites surrender: ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన
    ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన

    Naxalites surrender: ప్రధాని పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది నక్సలైట్ల లొంగుబాటు.. పోలీసుల కీలక ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 30, 2025
    05:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్‌ బిజాపూర్‌ జిల్లాలో పెద్ద ఎత్తున నక్సలైట్లు లొంగిపోయారు. మొత్తం 50 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

    వీరిలో 14 మంది తలపై కలిపి రూ.68 లక్షల రివార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు కొద్ది గంటల ముందు ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    లొంగిపోయిన 50 మంది నక్సలైట్లలో ఆరుగురికి ఒక్కొక్కరిపై రూ.8 లక్షల రివార్డు, ముగ్గురికి రూ.5 లక్షలు, మరో ఐదుగురికి రూ.1 లక్ష రివార్డు ఉంది.

    సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), జిల్లా రిజర్వ్‌ గార్డు (డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) ఈ లొంగుబాటులో కీలక పాత్ర పోషించాయి.

    Details

    గతేడాది 25 మంది లొంగుబాటు

    మావోయిస్టు ఉద్యమంలో విభేదాలు, ప్రభుత్వ పునరావాస విధానాలు కూడా ఈ నిర్ణయానికి కారణమైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.

    ప్రభుత్వ పునరావాస పథకం కింద లొంగిపోయిన వారికి సహాయ కార్యక్రమాలు అందించనున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.

    మరోవైపు ప్రధాని మోదీ తన పర్యటనలో రూ.33,700 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

    ఇదే ప్రాంతంలో గతేడాది ఆగస్టులోనూ 25 మంది నక్సలైట్లు లొంగిపోగా, వారిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డులు ఉన్నాయి.

    మొత్తం బస్తర్‌ ప్రాంతంలో 2023లో 790 మందికిపైగా నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఛత్తీస్‌గఢ్‌
    ఛత్తీస్‌గఢ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    నరేంద్ర మోదీ

    PM Modi:అమెరికాలో మోదీకి ఘన స్వాగతం.. ఎలాన్ మస్క్‌తో కీలక చర్చలు? ఎలాన్ మస్క్
    PM Modi: బ్లేయర్ హౌస్‌లో మోదీ బస.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? అమెరికా
    PM Modi Trump Meet: ముందుగా టారీఫ్‌లు... తర్వాత వాణిజ్య ఒప్పందాలు! డొనాల్డ్ ట్రంప్
    Narendra Modi: అమెరికాకు 'మాగా', ఇండియాకు 'మిగా'.. ట్రంప్‌తో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు భారతదేశం

    ఛత్తీస్‌గఢ్‌

    Chhattisgarh: నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి  ఛత్తీస్‌గఢ్
    Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ  కాంగ్రెస్
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    City Centre Mall: రాయ్‌పూర్‌లో విషాద ఘటన..తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి  ఛత్తీస్‌గఢ్

    ఛత్తీస్‌గఢ్

    Chhattisgarh: బీజాపూర్లో ఎన్‌కౌంటర్ .. ఆరుగురు మావోయిస్టులు మృతి  ఛత్తీస్‌గఢ్‌
    Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సలైట్ల హతం ఛత్తీస్‌గఢ్‌
    Chhattisgarh: రాయ్‌పూర్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో నివాసితులు ఛత్తీస్‌గఢ్‌
    Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 50 అడుగుల గోతిలో పడిన బస్సు .. 15 మంది మృతి  ఛత్తీస్‌గఢ్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025