NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకు లేఖ రాసిన 500 విద్యార్థినులు
    తదుపరి వార్తా కథనం
    Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకు లేఖ రాసిన 500 విద్యార్థినులు
    Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకు లేఖ రాసిన 500 విద్యార్థినులు

    Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకు లేఖ రాసిన 500 విద్యార్థినులు

    వ్రాసిన వారు Stalin
    Jan 08, 2024
    07:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానా సిర్సాలోని చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో సంచలనం ఘటన వెలుగులోకి వచ్చింది.

    ప్రొఫెసర్ తమను లైంగికంగా వేధిస్తున్నట్లు సుమారు 500మంది మహిళా కళాశాల విద్యార్థినులు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ గవర్నర్‌, మహిళా కమిషన్‌కు లేఖలు కూడా రాశారు.

    ప్రొఫెసర్ తన ఛాంబర్‌కు అమ్మాయిలను పిలిచి వారితో అసభ్యకర చర్యలకు పాల్పడుతున్నాడని లేఖలో పేర్కొన్నారు.

    ప్రొఫెసర్ వికృత చేష్టలపై విచారణ జరిపించాలని అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

    ప్రొఫెసర్ అసభ్యకరమైన చేష్టలకు పాల్పడుతున్నారని, అమ్మాయిలను తన కార్యాలయానికి పిలిచి, వారిని బాత్రూమ్‌కు తీసుకువెళతారని ఆరోపించారు.

    ప్రైవేట్ పార్ట్‌లను కూడా తాకుతాడని, ఈ విషయం బయటకు చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ప్రొఫెసర్ బెదిరిస్తున్నాడని లేఖలో ఆరోపించారు.

    హర్యానా

    సిట్‌ను ఏర్పాటు

    ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ని ఏర్పాటు చేసింది. విద్యార్థుల లేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    అయితే సదరు ప్రొఫెసర్‌పై విద్యార్థినులు ఫిర్యాదు చేయడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

    గతంలో యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ప్రొఫెసర్‌కు రెండుసార్లు క్లీన్ చిట్ ఇచ్చింది. కాగా, ప్రాథమిక విచారణ అనంతరం ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ఏఎస్పీ దీప్తి గార్గ్ తెలిపారు.

    లేఖలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతామన్నారు. విచారణలో తేలిన వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    యూనివర్సిటీ

    తాజా

    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు
    Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌! హరిహర వీరమల్లు
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!  ఆంధ్రప్రదేశ్

    హర్యానా

    హర్యానాలో బస్సు-క్రూయిజర్‌ ఢీ; 8 మంది మృతి రోడ్డు ప్రమాదం
    Rahul Gandhi: రైతన్నగా మారిన రాహుల్ గాంధీ; పొలం దున్ని, నాటు వేసిన కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ
    ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు  దిల్లీ
    గురుగ్రామ్: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిని కత్తితో పొడిచి హత్య  హత్య

    యూనివర్సిటీ

    NIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే విద్యా శాఖ మంత్రి
    పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం పాకిస్థాన్
    తెలంగాణలో కొత్తగా మరో 3 డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా.. మొత్తం 14కు చేరిన స్వయంప్రతిపత్తి కాలేజీలు డిగ్రీ
    యోగి స్వస్థలంలో దారుణం: యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025