NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Earthquakes : భారత్-మయన్మార్ సరిహద్దులో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా ఆరుసార్లు..
    తదుపరి వార్తా కథనం
    Earthquakes : భారత్-మయన్మార్ సరిహద్దులో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా ఆరుసార్లు..
    భారత్-మయన్మార్ సరిహద్దులో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా ఆరుసార్లు..

    Earthquakes : భారత్-మయన్మార్ సరిహద్దులో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా ఆరుసార్లు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 10, 2025
    01:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో గత కొద్ది గంటలుగా భూమి వరుసగా కంపిస్తోంది.

    గడచిన 36 గంటల వ్యవధిలో మొత్తం ఆరు సార్లు భూకంపాలు సంభవించాయి.

    రిక్టర్ స్కేలుపై ఈ ప్రకంపనల తీవ్రత 3.8 నుండి 4.5 వరకు నమోదైంది.

    ఈ వరుస భూకంపాల్లో చివరిది మంగళవారం ఉదయం 11:21 గంటలకు సంభవించింది.

    దీని తీవ్రత 4.3 గా నమోదు అయ్యింది. ఈ ప్రకంపనల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కి చెందిన కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది.

    ఈ వరుస ప్రకంపనలతో సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.

    అయితే, ఇవి తక్కువ స్థాయిలో ఉన్న ప్రకంపనలైనందున ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు.

    వివరాలు 

    మార్చి 28న మయన్మార్‌లో తీవ్రమైన భూకంపం

    ఇక,ఈ సంవత్సరపు మార్చి 28న మయన్మార్‌లో తీవ్రమైన భూకంపం సంభవించిన విషయం గుర్తు చేసుకోవాల్సిందే.

    ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది.

    ఈ భారీ ప్రకంపనల కారణంగా మయన్మార్‌లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది.

    అనేక భవనాలు కుప్పకూలిపోయాయి.అధికార సమాచారం ప్రకారం,ఆ విపత్తులో సుమారు 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

    వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.అంతేకాకుండా,ఈ భూకంప ప్రభావం మయన్మార్‌ పొరుగుదేశమైన థాయిలాండ్‌ వరకు విస్తరించింది.

    అంతర్జాతీయ రెడ్ క్రాస్,రెడ్ క్రెసెంట్ సొసైటీల సమాఖ్య (IFRC) ప్రకారం,ఈ విపత్తు కారణంగా సుమారు 2 లక్షల మంది ప్రజలు నివాసాలు కోల్పోయారు.

    అంతేగాక, మధ్య మయన్మార్‌లోని కొంతమంది ప్రాంతాల్లో ఇప్పటికీ రోజువారీగా ప్రకంపనలు కొనసాగుతున్నాయని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం

    తాజా

    Muhammad Yunus: షేక్ హసీనా రాజకీయ ప్రకటనలను ఆపాలని అభ్యర్థిస్తే.. మోదీ అంగీకరించలేదు: యూనస్‌  బంగ్లాదేశ్
    WTC Final 2025: లార్డ్స్‌లో బౌలర్ల హవా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి రోజు 14 వికెట్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే! తెలంగాణ
    Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు

    భూకంపం

    Earthquakes : ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు.. భయంతో ప్రజలు బయటకి పరుగులు ప్రకాశం జిల్లా
    Earthquake: చిలీలో భారీ భూకంపం .. కలమాకు 84 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపణలు  చిలీ
    #NewsBytesExplainer: టిబెట్‌లో భారీ భూకంపం.. భవిష్యత్తులో మరిన్ని భూకంపాలు తప్పవా? ప్రపంచం
    Earthquake: జపాన్‌లో భూకంపం కలకలం.. 6.9 తీవ్రతతో ప్రకంపనలు జపాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025