
Earthquakes : భారత్-మయన్మార్ సరిహద్దులో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా ఆరుసార్లు..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో గత కొద్ది గంటలుగా భూమి వరుసగా కంపిస్తోంది.
గడచిన 36 గంటల వ్యవధిలో మొత్తం ఆరు సార్లు భూకంపాలు సంభవించాయి.
రిక్టర్ స్కేలుపై ఈ ప్రకంపనల తీవ్రత 3.8 నుండి 4.5 వరకు నమోదైంది.
ఈ వరుస భూకంపాల్లో చివరిది మంగళవారం ఉదయం 11:21 గంటలకు సంభవించింది.
దీని తీవ్రత 4.3 గా నమోదు అయ్యింది. ఈ ప్రకంపనల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్కి చెందిన కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది.
ఈ వరుస ప్రకంపనలతో సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.
అయితే, ఇవి తక్కువ స్థాయిలో ఉన్న ప్రకంపనలైనందున ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు.
వివరాలు
మార్చి 28న మయన్మార్లో తీవ్రమైన భూకంపం
ఇక,ఈ సంవత్సరపు మార్చి 28న మయన్మార్లో తీవ్రమైన భూకంపం సంభవించిన విషయం గుర్తు చేసుకోవాల్సిందే.
ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది.
ఈ భారీ ప్రకంపనల కారణంగా మయన్మార్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది.
అనేక భవనాలు కుప్పకూలిపోయాయి.అధికార సమాచారం ప్రకారం,ఆ విపత్తులో సుమారు 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.అంతేకాకుండా,ఈ భూకంప ప్రభావం మయన్మార్ పొరుగుదేశమైన థాయిలాండ్ వరకు విస్తరించింది.
అంతర్జాతీయ రెడ్ క్రాస్,రెడ్ క్రెసెంట్ సొసైటీల సమాఖ్య (IFRC) ప్రకారం,ఈ విపత్తు కారణంగా సుమారు 2 లక్షల మంది ప్రజలు నివాసాలు కోల్పోయారు.
అంతేగాక, మధ్య మయన్మార్లోని కొంతమంది ప్రాంతాల్లో ఇప్పటికీ రోజువారీగా ప్రకంపనలు కొనసాగుతున్నాయని సమాచారం.