NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TG New Airports : తెలంగాణలో అందుబాటులోకి మరిన్ని విమానాశ్రయాలు.. 7 ముఖ్యమైన అంశాలు 
    తదుపరి వార్తా కథనం
    TG New Airports : తెలంగాణలో అందుబాటులోకి మరిన్ని విమానాశ్రయాలు.. 7 ముఖ్యమైన అంశాలు 
    తెలంగాణలో అందుబాటులోకి మరిన్ని విమానాశ్రయాలు.. 7 ముఖ్యమైన అంశాలు

    TG New Airports : తెలంగాణలో అందుబాటులోకి మరిన్ని విమానాశ్రయాలు.. 7 ముఖ్యమైన అంశాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 25, 2024
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంది.

    హైదరాబాద్‌లో ఉన్న బేగంపేట ఎయిర్‌పోర్ట్ ప్రముఖుల వినియోగానికి మాత్రమే పరిమితమై ఉంది.

    ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేసి ప్రజల అవసరాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    ఈ క్రమంలో కొన్ని ముఖ్యమైన విషయాలు క్రింది విధంగా ఉన్నాయి:

    వివరాలు 

    రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండటంతో అనుమతులు త్వరగా వచ్చే అవకాశం

    ఇటీవల వరంగల్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్, రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

    రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ నుండి సానుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ శాఖకు తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండటంతో అనుమతులు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

    నిజాం కాలంలో మామునూరు విమానాశ్రయం వాయుదూత్ విమానాల రాకపోకలకు ఉపయోగపడింది. ప్రస్తుతం ఇది మూసివేయబడినప్పటికీ, దాని అభివృద్ధి కోసం 696.14 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. అదనంగా 253 ఎకరాల భూమి కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లు మంజూరు చేసింది.

    వివరాలు 

    కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే భూసేకరణ

    మామునూరు విమానాశ్రయాన్ని రెండు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు ఉన్నాయి. మొదటి దశలో చిన్న విమానాలకు అనుగుణంగా, రెండో దశలో పెద్ద విమానాలు, కార్గో సేవల కోసం ఏర్పాట్లు చేయనున్నారు.

    రాబోయే నాలుగేళ్లలో వరంగల్‌తో పాటు రామగుండం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

    రామగుండం సమీపంలోని బసంత్‌నగర్‌లో గతంలో ఎయిర్‌పోర్టు ఉండేది. ఇప్పుడు అదే ప్రాంతంలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

    వివరాలు 

     ఇప్పటికే 1600 ఎకరాల భూమి సిద్ధం

    ఆదిలాబాద్‌లోనూ విమానాశ్రయం నిర్మాణానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 1600 ఎకరాల భూమి ఇప్పటికే సిద్ధంగా ఉంది. కేంద్రం నుండి అనుమతులు లభిస్తే, ప్రభుత్వం అన్ని అవసరాలు తీర్చేందుకు సిద్ధంగా ఉంది.

    ఈ చర్యల ద్వారా తెలంగాణలో విమాన ప్రయాణాల సౌలభ్యం మరింతగా పెరిగి, ప్రాంతీయ అభివృద్ధి కలుగుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    తెలంగాణ

    Telangana : రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు.. 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ ఇండియా
    Skill University: తెలంగాణలో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ.. 6 వేల మందికి నైపుణ్య శిక్షణ ప్రభుత్వం
    Tar Roads: గ్రామీణాభివృద్ధికి భారీ బడ్జెట్.. తెలంగాణలో 17,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ప్రభుత్వం
    Telangana Secretariat: టీజీఎస్పీ నుంచి ఎస్పీఎఫ్‌కు సచివాలయ భద్రతా మార్పు.. నవంబర్ 1 నుంచి అమలు సచివాలయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025