NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం 
    తదుపరి వార్తా కథనం
    కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం 
    కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం

    కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం 

    వ్రాసిన వారు Stalin
    Sep 26, 2023
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

    కొలీజియం చేసిన 70 సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉన్నట్లు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్.వెంకటరమణితో ఆందోళన వ్యక్తం చేసింది.

    నవంబర్ 11, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నట్లు కోర్టు పేర్కొంది.

    నాలుగు రోజుల క్రితం వరకు 80 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం పది ఫైళ్లను నాలుగు రోజుల క్రితం ఆమోదించిందని ధర్మసనం పేర్కొది.

    దీంతో సిఫార్సుల పెండింగ్ సంఖ్య 70కి చేరుకున్నట్లు వెల్లడించింది.

    సుప్రీంకోర్టు

    అక్టోబర్ 9 నాటికి కేంద్రం వివరణ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

    వివిధ హైకోర్టుల్లోని కొలీజియంలు సిఫార్సు చేసిన 70మంది పేర్లను ఇంకా సుప్రీంకోర్టు కొలీజియంకు ఎందుకు పంపలేదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

    పెండింగ్ ఫైళ్లపై అక్టోబర్ 9 నాటికి కేంద్రం వివరణను సమర్పించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణికి ఆదేశాలు జారీ చేసింది.

    హైకోర్టు కొలీజియంలు తమ సిఫార్సులను చేసిన తర్వాత నాలుగు నెలల్లో సుప్రీంకోర్టు కొలీజియంకు పంపాల్సి ఉంటుంది.

    కానీ 10 నెలలు దాటినా ఎందుకు పంపలేదని ధర్మాసనం అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది.

    ప్రతి 10 రోజులకు ఒకసారి కొలీజియం నియామకాల స్థితిని తాను పర్యవేక్షిస్థానని ఈ సందర్భంగా జస్టిస్ కౌల్ పేర్కొన్నారు.

    జస్టిస్ కౌల్ డిసెంబర్ 2023లో సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేయబోతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    తాజా వార్తలు
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    సుప్రీంకోర్టు

    కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట  వనమా వెంకటేశ్వరరావు
    బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ బిహార్
    రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అవమానకరం.. హరిశ్ సాల్వే ఘాటు విమర్శలు  రాహుల్ గాంధీ
    రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ డివై చంద్రచూడ్

    తాజా వార్తలు

    నిజ్జార్‌ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కొన్ని వారాల క్రితమే భారత్‌తో పంచుకున్నాం: ట్రూడో  ఖలిస్థానీ
    ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారా? ఈ జీఐ ట్యాగ్ వస్తువులను కొనడం మర్చిపోవద్దు  ఆంధ్రప్రదేశ్
    'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్ భారతదేశం
    తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు టీఎస్పీఎస్సీ

    కేంద్ర ప్రభుత్వం

    మణిపూర్ అమానుష వైరల్ వీడియో కేసు సీబీఐ చేతికి.. సుప్రీంకు కేంద్రం వివరణ మణిపూర్
    Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం తెలంగాణ
    2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి మధ్యప్రదేశ్
    నేటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025