NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు
    భారతదేశం

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 26, 2023, 01:29 pm 1 నిమి చదవండి
    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు
    కర్తవ్య‌పథ్‌‌లో ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు

    దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళితో గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని కర్తవ్య‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్య‌పథ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎంపిక చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. కర్తవ్య‌పథ్‌లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కర్తవ్య‌పథ్‌లో మొదటిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ 8న కర్తవ్య‌పథ్‌ని మోదీ ప్రారంభించారు.

    దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ

    దేశ ప్రజలకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన వీరల కలలను నెరనేర్చేందుకు అందరం ఐక్యంగా ముందుకు సాగాలన్నారు మోదీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలంలో జరుగుతున్న ఈ వేడకలు మరింత ప్రత్యేకమని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. కర్తవ్య‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల కోసం భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి), ఢిల్లీ పోలీసులతో సహా దాదాపు 6,000 మంది సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. కర్తవ్య‌పథ్ పర్యవేక్షణకు దాదాపు 150 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశాతో పాటు అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు జెండాలను ఆవిష్కరించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    నరేంద్ర మోదీ
    రాష్ట్రపతి
    దిల్లీ

    తాజా

    మార్చి 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్

    నరేంద్ర మోదీ

    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా ముకేష్ అంబానీ
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా భారతదేశం

    రాష్ట్రపతి

    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము

    దిల్లీ

    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు కల్వకుంట్ల కవిత
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! భారతదేశం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023