NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు
    తదుపరి వార్తా కథనం
    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు
    కర్తవ్య‌పథ్‌‌లో ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు

    వ్రాసిన వారు Stalin
    Jan 26, 2023
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళితో గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని కర్తవ్య‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్య‌పథ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ హాజరయ్యారు.

    రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎంపిక చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. కర్తవ్య‌పథ్‌లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

    కర్తవ్య‌పథ్‌లో మొదటిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ 8న కర్తవ్య‌పథ్‌ని మోదీ ప్రారంభించారు.

    గణతంత్ర దినోత్సవం

    దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ

    దేశ ప్రజలకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన వీరల కలలను నెరనేర్చేందుకు అందరం ఐక్యంగా ముందుకు సాగాలన్నారు మోదీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలంలో జరుగుతున్న ఈ వేడకలు మరింత ప్రత్యేకమని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

    కర్తవ్య‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల కోసం భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి), ఢిల్లీ పోలీసులతో సహా దాదాపు 6,000 మంది సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. కర్తవ్య‌పథ్ పర్యవేక్షణకు దాదాపు 150 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశాతో పాటు అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు జెండాలను ఆవిష్కరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గణతంత్ర దినోత్సవం
    దిల్లీ

    తాజా

    Stock Market: కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! స్టాక్ మార్కెట్
    Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్ విశ్వంభర
    Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే! పర్యాటకం
    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్

    గణతంత్ర దినోత్సవం

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం దిల్లీ
    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది ఛత్తీస్‌గఢ్
    రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి లైఫ్-స్టైల్
    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం తెలంగాణ

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? టాటా
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025