NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / work-life balance:కుటుంబానికే ప్రాధాన్యత అంటున్నభారతదేశంలోని ఉద్యోగులు .. వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌పై 78% మంది అభిప్రాయమిదే! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    work-life balance:కుటుంబానికే ప్రాధాన్యత అంటున్నభారతదేశంలోని ఉద్యోగులు .. వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌పై 78% మంది అభిప్రాయమిదే! 
    కుటుంబానికే ప్రాధాన్యత అంటున్నభారతదేశంలోని ఉద్యోగులు

    work-life balance:కుటుంబానికే ప్రాధాన్యత అంటున్నభారతదేశంలోని ఉద్యోగులు .. వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌పై 78% మంది అభిప్రాయమిదే! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 28, 2025
    06:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వారానికి 72 గంటలు లేదా 90 గంటలు పని చేయాలని ఇటీవల పెద్ద ఎత్తున చర్చ సాగింది.

    దీన్ని వ్యతిరేకించే వాళ్లే కాకుండా, అనుకూలంగా కూడా అనేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

    ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఒక సర్వే సంస్థ పరిశీలన చేపట్టింది.

    సర్వేలో 78 శాతం భారతీయులు కుటుంబమే తమకు ప్రాధాన్యమని పేర్కొనడం గమనార్హం.

    ఆ తరువాతే ఇతర విషయాలపై అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశానికి సంబంధించిన 'ఫ్యూచర్ కెరీర్ రిజల్యూషన్ రిపోర్ట్'ను ప్రముఖ జాబ్‌సైట్ ఇండీడ్‌ విడుదల చేసింది.

    వివరాలు 

    మానసిక ఆరోగ్యంపైనా దృష్టి

    ఈ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఐదుగురు మందిలో నలుగురు (78 శాతం) కుటుంబ బంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇండీడ్ వెల్లడించింది.

    వారు 2025లో కెరీర్‌లో విజయాన్ని సాధించడం కన్నా, తమ భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో సమయం గడపడం కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

    తక్కువ పని ఒత్తిడి ఉండేలా చూసుకోవడమే కాక, మానసిక ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

    ఈ సర్వేలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని చాలామంది వ్యక్తం చేశారు.

    వివరాలు 

    సర్వేలో  2507 భారతీయ ఉద్యోగులు 

    2024 డిసెంబర్‌ నుండి 2025 జనవరి మధ్య కాలంలో, భారత్‌తో పాటు జపాన్, ఆస్ట్రేలియా దేశాలలో ఇండీడ్ ఈ సర్వే నిర్వహించింది.

    ఇందులో 2507 భారతీయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇండీడ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాచెల్ టౌన్స్లీ ప్రకారం, భారతీయ ఉద్యోగుల మధ్య పని, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత కోరుకునే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు.

    ఎక్కువ సంపాదించడం ముఖ్యమైనప్పటికీ, జీవితంలో ఎదగడమనేది కేవలం నిచ్చెనగా పరిగణించబడటం లేదని చెప్పారు.

    భద్రత, సరైన వేతనం, ఇతర ప్రయోజనాల వంటి అంశాలను కూడా వారు ప్రాధాన్యంగా చూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    PM Kisan FPO Scheme : రైతుల కోసం కేంద్రం ప్రత్యేక పథకం.. పీఎంకేఎఫ్‌పీఓ కింద రూ.15 లక్షల ఆర్థిక సాయం రైతుబంధు
    India-China: ఎల్‌ఏసీపై పెట్రోలింగ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి ?  చైనా
    Medicines Fail: దేశంలో 49 రకాల మందులు నాణ్యతలో ఫెయిల్.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఇండియా
    India's defence exports: రూ.22,000 కోట్లకు చేరుకున్నభారతదేశ రక్షణ ఎగుమతులు..అమెరికాతో సహా మన దగ్గర కొనుగోలు చేసే దేశాలు ఇవే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025