NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / DAJGUA: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి 878 గ్రామాలు ఎంపిక: దుర్గాదాస్‌ ఉయికే 
    తదుపరి వార్తా కథనం
    DAJGUA: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి 878 గ్రామాలు ఎంపిక: దుర్గాదాస్‌ ఉయికే 
    ‘ధర్తీ ఆబా’లో 878 ఏపీ గ్రామాలు

    DAJGUA: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి 878 గ్రామాలు ఎంపిక: దుర్గాదాస్‌ ఉయికే 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 20, 2024
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి,విద్య,వైద్యం,అంగన్‌వాడీ కేంద్రాల అందుబాటులోకి తీసుకురావడాన్నిలక్ష్యంగా పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 2న ప్రారంభించిన ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 878 గ్రామాలు ఎంపికైనట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గాదాస్ ఉయికే వెల్లడించారు.

    ఈ విషయాన్నిలోక్‌సభలో తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

    ఎంపికైన గ్రామాల్లో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 521, పార్వతీపురం మన్యం నుంచి 165,ఏలూరు నుంచి 46,శ్రీకాకుళం నుంచి 34గ్రామాలుగా తెలిపారు.

    అదే విధంగా,ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లోని 12జిల్లాల నుంచి 517 గ్రామాలు ఎంపికైనట్లు మంత్రి మరో ప్రశ్నకు బదులిచ్చారు.

    వివరాలు 

    రాష్ట్రానికి రెండు ప్రాంతీయ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు మంజూరుకు అర్హత

    అయితే, ఈ గ్రామాలకు అభివృద్ధి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించనందున, నిధులు విడుదల చేయలేదని,రూ.119.47 కోట్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉందని మంత్రి తెలిపారు.

    ఇక రాష్ట్రానికి సంబంధించిన డ్రైవింగ్ ట్రైనింగ్ సంస్థల అంశంలో,2016లో దర్శి, 2021లో డోన్‌లకు మంజూరు చేసిన ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐడీటీఆర్‌)లు ఇంకా ప్రారంభం కాలేదని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు.

    విజయవాడలో ప్రస్తుతం ఒకటే ఐడీటీఆర్‌ పనిచేస్తోందని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఏపీలో కొత్తగా ఐడీటీఆర్‌లు ఏర్పాటుకు అర్హత లేదని ఆయన వివరించారు.

    అయితే, రాష్ట్రానికి రెండు ప్రాంతీయ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు మంజూరుకు అర్హత ఉందని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త పెన్షన్లకై పెద్ద సంఖ్యలో లబ్ది దారులు.. పైలెట్ ప్రాజెక్టుగా సర్వే భారతదేశం
    R. Krishnaiah: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య బీజేపీ
    Nagababu: త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌లోకి నాగబాబు.. ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు భారతదేశం
    AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు తీపికబురు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025