NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra Elections: రాష్ట్రంలో 9.7 కోట్ల ఓటర్లు.. మహిళలు 4.6 కోట్లు, తొలి ఓటర్లు తక్కువే!
    తదుపరి వార్తా కథనం
    Maharashtra Elections: రాష్ట్రంలో 9.7 కోట్ల ఓటర్లు.. మహిళలు 4.6 కోట్లు, తొలి ఓటర్లు తక్కువే!
    రాష్ట్రంలో 9.7 కోట్ల ఓటర్లు.. మహిళలు 4.6 కోట్లు, తొలి ఓటర్లు తక్కువే!

    Maharashtra Elections: రాష్ట్రంలో 9.7 కోట్ల ఓటర్లు.. మహిళలు 4.6 కోట్లు, తొలి ఓటర్లు తక్కువే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 31, 2024
    02:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార కూటమి, విపక్షాలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి.

    కేంద్ర ఎన్నికల సంఘం తాజా గణాంకాల ప్రకారం, మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లున్నారు. వారిలో 5 కోట్ల మంది పైగా పురుషులు, 4.6 కోట్ల మంది మహిళలున్నారు.

    ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే 18-19 ఏళ్ల యువ ఓటర్లు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నారు. అంటే 22.22 లక్షల మంది మాత్రమే ఉన్నారు.

    శతాధిక వృద్ధులు 21,089 మంది ఉన్నారని ఈసీ ధ్రువీకరించింది. అక్టోబరు 15న ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో రాష్ట్రంలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

    Details

    72 లక్షలు పెరిగిన ఓటర్ల సంఖ్య

    అక్టోబరు 19వరకు కొత్తగా 6.55 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే, ఈసారి ఓటర్ల సంఖ్య 72 లక్షలు పెరిగింది.

    పుణె జిల్లా 88.49 లక్షల ఓటర్లతో అగ్రస్థానంలో ఉండగా, ముంబయి సబర్బన్‌లో 76.86 లక్షలు, ఠాణెలో 72.29 లక్షలు, నాసిక్‌లో 50.61 లక్షలు, నాగ్‌పుర్‌లో 45.25 లక్షల ఓటర్లు ఉన్నారు.

    అత్యల్పంగా సింధ్‌దుర్గ్‌ జిల్లాలో 6.78 లక్షల ఓటర్లు ఉన్నారు. గత 13 అసెంబ్లీ ఎన్నికల్లో సగటు ఓటింగ్ 62.2 శాతం కాగా, అత్యధికంగా 1995లో 71.6 శాతం, అత్యల్పంగా 1980లో 53.3 శాతం నమోదైంది.

    2019లో 61.1 శాతం ఓటింగ్ నమోదైంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 20న పోలింగ్ జరగనుంది.

    Details

    నవంబర్ 23న ఫలితాలు

    ఫలితాలు నవంబరు 23న వెలువడతాయి.

    ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన, ఎన్సీపీ మిత్ర కూటమి తమ విజయానికి ప్రయత్నిస్తోంది.

    ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కూడా అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో బలంగా బరిలోకి దిగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ఇండియా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    మహారాష్ట్ర

    Travel influence: రీల్స్ చేస్తుండగా ప్రమాదం.. జలపాతంలో పడి ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి  భారతదేశం
    Maharastra:14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పూజా ఖేద్కర్ తల్లి  భారతదేశం
    Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ ఇండియా
    Maharastra: మహారాష్ట్రలో భారీ వర్షాలు..పూణెలో నలుగురు మృతి.. పాఠశాలలు, కళాశాలలు బంద్  భారీ వర్షాలు

    ఇండియా

    Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌ సీఎం పదవి ఒమర్‌దే.. ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు జమ్ముకశ్మీర్
    Kolkata: జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక మలుపు.. 50 మంది రాజీనామా  కోల్‌కతా
    Garba dance: నవరాత్రి పండుగలో గర్భా, దాండియా ప్రాముఖ్యత.. ఎందుకు ఆడతారు తెలుసా? గుజరాత్
    Birds: పక్షులు చెట్టు కొమ్మలపై నిద్రపోతున్నప్పుడు నేలమీద ఎందుకుపడవో తెలుసా?.. కారణమిదే!  జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025