LOADING...
Narendra Modi: సంగీత ప్రపంచానికి పెద్ద లోటు.. ప్రధాని మోదీ భావోద్వేగ స్పందన
సంగీత ప్రపంచానికి పెద్ద లోటు.. ప్రధాని మోదీ భావోద్వేగ స్పందన

Narendra Modi: సంగీత ప్రపంచానికి పెద్ద లోటు.. ప్రధాని మోదీ భావోద్వేగ స్పందన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను ఎంతో కలచివేసిందని పేర్కొంటూ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా నివాళులర్పించారు. భారతదేశం చూసిన అత్యంత ప్రసిద్ధి చెందిన, బహుముఖ ప్రజ్ఞావంతులైన గాయకుల్లో ఆశా భోంస్లే ఒకరని ఆయన కొనియాడారు. "భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయని ఆశా భోంస్లే గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రయాణం మన సాంస్కృతిక వారసత్వాన్ని మరింత సుసంపన్నం చేసింది.

వివరాలు

రాబోయే తరాలకు అమె పాట స్ఫూర్తి

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాలను ఆమె తన గానంతో మంత్రముగ్ధులను చేశారు. మృదువైన మెలోడీలు అయినా, ఉత్సాహభరితమైన పాటలైనా, ఆమె గొంతులో కాలాతీతమైన ప్రతిభ ప్రతిధ్వనించింది. ఆమెతో నాకు ఉన్న పరిచయం, సంభాషణలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాబోయే తరాలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తారు. ఆమె పాటలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో మార్మోగుతూనే ఉంటాయి" అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

Advertisement