LOADING...
Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2024
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్‌ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళిత బంధు రెండో విడత నిధుల విడుదల కోసం కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజురాబాద్‌లో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నాకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం వల్ల పోలీసులు బీఎన్‌ఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 35(3) కింద కేసు నమోదు చేసి నోటీసులు అందజేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో కౌశిక్ రెడ్డి ముందున్నారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ, బొగ్గు బూడిద రవాణాలో భారీ అక్రమాలు జరిగాయని విమర్శించారు. అసెంబ్లీ లోపల, బయట కూడా సీఎం రేవంత్ రెడ్డి పాలనను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై ధ్వజమెత్తుతున్నారు.

Details

హుజురాబాద్‌లో వేడెక్కిన వాతావరణం

కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితంలో ఫిరాయింపు వివాదాలు కొత్తవి కావు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన ఆయన, అరికపూడి గాంధీతో వ్యక్తిగత సవాళ్లు విసురుకోవడంతో వివాదం మరింత పెరిగింది. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. కౌశిక్ రెడ్డి నాయకత్వంలోని నిరసనలకు అనుమతి తీసుకోకపోవడం పోలీసులు కేసు నమోదు చేయడానికి దారితీసింది. హుజురాబాద్‌లో రాజకీయ వాతావరణం తీవ్రంగా ముదిరింది. విపక్షాలు సైతం ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడంతో, బీఆర్ఎస్ శ్రేణులు రక్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్నాయి.