Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు
ఈ వార్తాకథనం ఏంటి
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో దిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. దిల్లీలో 15ఏళ్ల క్రితం సౌమ్య విశ్వనాథన్ హత్య జరిగింది.
ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి దిల్లీలోని సాకేత్ కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మరో దోషికి ఇప్పటికే జైలు శిక్ష పడింది.
నలుగురు నిందితులు రవికపూర్, అమిత్ శుక్లా, బల్బీర్ మాలిక్, అజయ్ కుమార్లకు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద ఒక్కొక్కరికి రూ.25,000, రూ.లక్ష జరిమానాను కోర్టు విధించింది.
ఐదో దోషి అజయ్ సేథీకి రూ.7.5 లక్షల జరిమానా విధించింది.
దిల్లీ
2008లో సౌమ్య హత్య
నలుగురు దోషులకు విధించిన జరిమానాలో రూ.1.2 లక్షలను సౌమ్య విశ్వనాథన్ తల్లిదండ్రులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
అజయ్ సేథీ చెల్లించాల్సిన రూ.7.25 లక్షలలో రూ. 7.2 లక్షలు సౌమ్య కుటుంబానికి ఇవ్వాలని చెప్పింది. నలుగురు దోషుల చర్య అరుదైన కేటగిరీ కిందకు రాదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది.
ఇండియా టుడే గ్రూప్లో సౌమ్య జర్నలిస్ట్ పని చేసేది. 2008 సెప్టెంబర్ 30 తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్లో సౌమ్యను దుండగులు కాల్చి చంపారు.
చోరీయే ఈ హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు 18న కోర్టు మొత్తం ఐదుగురు నిందితులను హత్య కేసులో కోర్టు దోషులుగా నిర్ధారించింది.