NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు
    తదుపరి వార్తా కథనం
    Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు
    Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు

    Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు

    వ్రాసిన వారు Stalin
    Nov 25, 2023
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో దిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. దిల్లీలో 15ఏళ్ల క్రితం సౌమ్య విశ్వనాథన్ హత్య జరిగింది.

    ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి దిల్లీలోని సాకేత్ కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో మరో దోషికి ఇప్పటికే జైలు శిక్ష పడింది.

    నలుగురు నిందితులు రవికపూర్, అమిత్ శుక్లా, బల్బీర్ మాలిక్, అజయ్ కుమార్‌లకు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద ఒక్కొక్కరికి రూ.25,000, రూ.లక్ష జరిమానాను కోర్టు విధించింది.

    ఐదో దోషి అజయ్ సేథీకి రూ.7.5 లక్షల జరిమానా విధించింది.

    దిల్లీ

    2008లో సౌమ్య హత్య

    నలుగురు దోషులకు విధించిన జరిమానాలో రూ.1.2 లక్షలను సౌమ్య విశ్వనాథన్ తల్లిదండ్రులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

    అజయ్ సేథీ చెల్లించాల్సిన రూ.7.25 లక్షలలో రూ. 7.2 లక్షలు సౌమ్య కుటుంబానికి ఇవ్వాలని చెప్పింది. నలుగురు దోషుల చర్య అరుదైన కేటగిరీ కిందకు రాదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది.

    ఇండియా టుడే గ్రూప్‌లో సౌమ్య జర్నలిస్ట్ పని చేసేది. 2008 సెప్టెంబర్ 30 తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్‌లో సౌమ్యను దుండగులు కాల్చి చంపారు.

    చోరీయే ఈ హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు 18న కోర్టు మొత్తం ఐదుగురు నిందితులను హత్య కేసులో కోర్టు దోషులుగా నిర్ధారించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హత్య
    తాజా వార్తలు

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    దిల్లీ

    RAPIDX Train : 'ర్యాపిడ్‌'ఎక్స్‌ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు నరేంద్ర మోదీ
    Swiss Woman: దిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి..  స్విట్జర్లాండ్
    Earthquake: నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. దిల్లీలో ప్రకంపనలు భూకంపం
    దిల్లీ: AQI తగ్గినప్పుడు 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్'.. ప్రస్తుతానికి బేసి-సరి నియమం లేదు భారతదేశం

    హత్య

    Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు  రాజస్థాన్
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    కెనడాలో ఘోరం.. బైక్ కోసం భారత విద్యార్థిని హత్య చేసిన దుండగులు కెనడా
    Assam: ట్రిపుల్ మర్డర్ కేసు: అత్త, మామ, భార్యను చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్  అస్సాం/అసోం

    తాజా వార్తలు

    ఆపిల్, ట్విట్టర్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వ్వవస్థాపకులు, సీఈఓలు వీరే  ఫ్లిప్‌కార్ట్
    Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు  వేములవాడ
    UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు  మణిపూర్
    Khichdi In Bottles: సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు తొలిసారిగా వేడి భోజనం.. ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్  ఉత్తరాఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025