NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Parliament security breach: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్‌ రీక్రియేషన్‌'కు ప్లాన్‌..! 
    తదుపరి వార్తా కథనం
    Parliament security breach: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్‌ రీక్రియేషన్‌'కు ప్లాన్‌..! 
    పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్‌ రీక్రియేషన్‌'కు ప్లాన్‌..!

    Parliament security breach: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్‌ రీక్రియేషన్‌'కు ప్లాన్‌..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 15, 2023
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసుపై విచారణ జరుపుతున్న దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, ఈ కేసులో అరెస్టయిన ఐదుగురితో సంబంధం ఉందన్న అనుమానంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది.

    అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మహేష్,కైలాష్‌గా గుర్తించారు.ఇద్దరూ రాజస్థాన్ నివాసితులు. 'జస్టిస్ ఫర్ ఆజాద్ భగత్ సింగ్'అనే సోషల్ మీడియా గ్రూప్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నారు.

    స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ విచారణలో,దాడి బృందంలో మహేష్ కూడా భాగం కాబోతున్నాడని తెలిసింది.అయితే కొన్ని కారణాల వల్ల అతని కుటుంబ సభ్యులు అతన్ని అడ్డుకున్నారు. అంతే కాకుండా,ఐదవ నిందితుడు,సూత్రధారి అయిన లలిత్ ఝా ఢిల్లీ నుండి రాజస్థాన్‌లోని కుచామన్‌కు చేరుకున్న తర్వాత అతని సహచరుల మొబైల్ ఫోన్‌లను తగ్గాలబెట్టడంలో కూడా మహేష్ సహాయం చేశాడు.

    Details 

    నెలరోజుల క్రితమే దాడికి సన్నాహాలు

    మరోవైపు, గత రాత్రి, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్ (DCP), అదనపు పోలీసు కమిషనర్లతో సహా సీనియర్ పోలీసు అధికారులు లలిత్ ఝాను విచారించారు.

    ఈ సమయంలో అతను మొత్తం సంఘటనను అధికారులకు వివరించాడు.

    విచారణలో నెలరోజుల క్రితమే దాడికి సన్నాహాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

    పార్లమెంటులో ప్రవేశించడానికి ప్రవేశ పాస్ అవసరం ఉండడంతో సులువుగా పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రతి ఒక్కరు పాస్‌ను ఏర్పాటు చేసుకోవాలని లలిత్ దాడిలో పాల్గొన్న మిగతావారిని కోరారు.

    రాజస్థాన్‌లోని హోటల్ నుండి లలిత్ న్యూస్ ఛానెల్‌ల ద్వారా జరుగుతున్న పరిణామాలు,పోలీసుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచారు.

    Details 

    స్పెషల్ ఆర్డర్‌పైన లక్నోలో రెండు జతల బూట్లు

    ఈ కేసులో మరిన్ని వివరాలను వెలికితీసేందుకు, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఆరు బృందాలను ఏర్పాటు చేసింది.

    ఇవి లక్నో, మైసూర్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానాలలోని నిందితులతో సంబంధం ఉన్న ప్రదేశాలకు వెళ్లాయి.

    అంతే కాకుండా, నిందితుడిని 7 రోజుల పాటు స్పెషల్ సెల్ కస్టడీలో ఉంచినందున, క్రాస్ వెరిఫికేషన్,సాక్ష్యాలను గుర్తించడం కోసం నిందితులను వేర్వేరు ప్రదేశాలకు కూడా తీసుకువెళతారు.

    లక్నోలో రెండు జతల బూట్లు స్పెషల్ ఆర్డర్‌పైన తయారు చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్లమెంటులో బూట్లు తనిఖీ చెయ్యరని నిందితులు తెలుసుకున్నారు.

    పార్లమెంటు లోపల పొగ డబ్బాను తీసుకెళ్లడానికి ఇదే సులభమైన మార్గం.

    Details 

    భద్రతా ఉల్లంఘన ఘటనను రీక్రియేట్‌ చేయాలని పోలీసుల యోచన 

    ఇదిలావుండగా, ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం బుధవారం నాటి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన అలజడి ఘటనను శని లేదా ఆదివారాల్లో పార్లమెంటు కాంప్లెక్స్‌కు తీసుకువెళ్లడం ద్వారా రి క్రియట్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

    ఈ 'సీన్‌ రీక్రియేషన్‌ వల్ల నిందితులు కలర్ స్ప్రేతో పార్లమెంటు భవనంలోకి ఎలా ప్రవేశించారు, వారి ప్రణాళికను ఎలా అమలు చేశారు అనే విషయాలను తెలుసుకోవడానికి ఇది పోలీసులకు సహాయపడుతుందని స్పెషల్ సెల్ వర్గాలు తెలిపాయి.

    వాస్తవానికి ఘటన జరిగిన నాడే ఈ సీన్‌ రీక్రియేషన్‌ ప్రక్రియ చేపట్టాలని పోలీసులు భావించినా.. సభా కార్యకలాపాల వల్ల అది సాధ్యపడలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    దిల్లీ

    POLLUTION : దిల్లీలో డేంజర్ బెల్స్.. వాయుకాలుష్యంతో ఆస్పత్రి బాటలో దిల్లీ వాసులు భారతదేశం
    బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రాన్ని కోరిన పర్యావరణ మంత్రి ఇండియా
    Manish Sisodia:ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా
    Delhi: 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో డాక్యుమెంటరీ మేకర్ మృతి  రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025