తదుపరి వార్తా కథనం

Broken landslides: విజయవాడలో కొండచరియలు విరిగిపడి బాలిక మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 31, 2024
10:24 am
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద శుక్రవారం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ప్రమాదంలో ఒక బాలిక మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు.
ఈ ఘటనలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా దెబ్బతిన్న ఇంట్లో కొందరు చిక్కుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మీరు పూర్తి చేశారు