Page Loader
Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు
ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు

Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో 30 టెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం తర్వాత భక్తులు భయాందోళనలో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.